Road Accident: రోడ్డు ప్రమాదంలో టేబుల్‌ టెన్నిస్‌ యువ క్రీడాకారుడి మృతి..

రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన టెబుల్‌ టెన్నిస్‌ యువ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్‌

Updated : 18 Apr 2022 14:03 IST

గువహటి: రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన టెబుల్‌ టెన్నిస్‌ యువ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్‌(18) మృతి చెందాడు. గువహటి నుంచి షిల్లాంగ్‌కు టాక్సీలో ప్రయాణిస్తుండగా మేఘాలయాలోని షాంగ్‌బంగ్లా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య ఓ ప్రకటనలో తెలిపింది. 83వ సీనియర్‌ జాతీయ, అంతరాష్ర్ట టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ఆటలో పాల్గొనేందుకు విశ్వ దీనదయాళన్‌ మరో ముగ్గురు క్రీడాకారులతో కలిసి టాక్సీలో బయల్దేరాడు. మార్గ మధ్యంలో ఎదురుగా వస్తోన్న ఓ భారీ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి వీరు ప్రయాణిస్తున్న వాహనంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో టాక్సీ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన విశ్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ సంగ్మా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విశ్వ అనేక జాతీయ ర్యాకింగ్‌ టైటిళ్లతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని