
Published : 11 Nov 2021 01:20 IST
‘చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్’ దక్కించుకున్న అమెరికాలోని తెలుగు బాలిక
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చు ఓ పెద్ద సమస్యగా మారింది. ఈ ముప్పుతో లక్షలాది ఎకరాల్లోని అడవులు కాలి బూడిదవుతున్నాయి. వేలాది జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి అడవికి నిప్పంటుకుంటే దాన్ని ఆర్పేయడం ఎవరితరం కావడం లేదు. దీంతో ఆయా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కాగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ.. అమెరికాలో స్థిరపడ్డ 15 ఏళ్ల తెలుగు బాలిక ముందుకొచ్చింది. ఏఐ టెక్నాలజీతో కార్చిచ్చును మందుగానే అంచనా వేయొచ్చంటూ బాలిక రేష్మా కోసరాజు ఓ ప్రాజెక్టును రూపొందించింది. దాదాపు 90 శాతం కచ్చితత్వంతో కార్చిచ్చును ఇది అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు 2021 ఏడాదికి గాను ఉత్తమ చిల్డ్రన్ క్లైమేట్ ప్రైజ్ను దక్కించుకుంది. రేష్మా కుటుంబం కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడింది.
ఇవీ చదవండి
Tags :