Nawab Malik: వాంఖడే గుట్టు ఎవరు బయటపెడతారో..?
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు సహా మరో ఐదు కేసులు ఎన్సీబీ ముంబయి పరిధి నుంచి బదిలీ అయిన సంగతి తెలిసిందే. వాటిని ఏజెన్సీకి చెందిన సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేయనుంది. దానిలో భాగంగా ప్రత్యేక బృందం(సిట్) శనివారం ముంబయికి రానుంది. మరోపక్క ఆర్యన్ కేసులో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ముంబయి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు సహా మరో ఐదు కేసులు ఎన్సీబీ ముంబయి పరిధి నుంచి బదిలీ అయిన సంగతి తెలిసిందే. వాటిని ఏజెన్సీకి చెందిన సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేయనుంది. దానిలో భాగంగా ప్రత్యేక బృందం(సిట్) శనివారం ముంబయికి రానుంది. మరోపక్క ఆర్యన్ కేసులో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కేసు నుంచి తప్పించడంపై వాంఖడే ఏమన్నారంటే..
ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్సీబీ ముంబయి జోన్ అధికారి సమీర్ వాంఖడేను తొలగించారు. ఆయనపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పిస్తూ ఎన్సీబీ డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సమీర్ వాంఖడే స్పందించారు. ‘ఆర్యన్ ఖాన్ కేసు, నవాబ్ మాలిక్ ఆరోపణలను కేంద్ర ఏజెన్సీతో విచారించాలని నేను అభ్యర్థించాను. అందుకు తగ్గట్టే దిల్లీకి చెందిన ప్రత్యేక బృందం ఈ కేసును విచారించనుంది. అలాగే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ కేసుపై కూడా దృష్టి సారించనుంది. ఈ దర్యాప్తులో భాగంగా దిల్లీ, ముంబయి ఎన్సీబీ బృందాలు సహకరించుకోనున్నాయి. ఇంకోవిషయం ఏంటంటే.. నేను ముంబయి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ పదవిలోనే ఉన్నాను. నన్ను ఆ ఉద్యోగం నుంచి తీసివేయలేదు’ అంటూ ఓ మీడియా సంస్థతో వాంఖడే అన్నారు
వాంఖడే గుట్టు ఎవరు బయటపెడతారో..
సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తన విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ‘డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు, అలాగే అతడి విడుదలకు భారీగా డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణపలపై సమీర్ దావూద్ వాంఖడేపై నేను సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాను. ఇప్పుడు కేంద్రరాష్ట్ర స్థాయుల్లో ఆయన్ను విచారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆ రెండు బృందాల్లో వాస్తవాలను ఎవరు వెలుగులోకి తేస్తారో చూడాలి. అలాగే వాంఖడే దుర్మార్గపు ప్రైవేటు ఆర్మీని ఎవరు బయటపెడతారో చూడాలి’ అంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు