Farm Laws: సాగుచట్టాల రద్దు.. అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఉద్యమం ఆగదు!
వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన రైతు సంఘాలు
దిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిపై స్పష్టత వచ్చేవరకూ ఇప్పటికే తలపెట్టిన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో నేడు దిల్లీలో భేటీ అయిన వివిధ రైతు సంఘాల నేతలు.. నవంబర్ 27న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
‘వ్యవసాయ చట్టాల రద్దు అంశంపై చర్చించాం. ఇందులో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తాం. ముఖ్యంగా నవంబర్ 22న యూపీలో జరిగే మహాపంచాయత్, నవంబర్ 26న దిల్లీ సరిహద్దుల్లో నిరసనలతోపాటు నవంబర్ 29న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ను చేపడతాం’ అని రైతునేత బల్బార్ సింగ్ రాజేవాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, విద్యుత్ సవరణ బిల్లు రద్దు, రైతులపై కేసుల ఎత్తివేత వంటి డిమాండ్లను తెలియజేస్తూ ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాస్తామని వెల్లడించారు. ఇక రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, మరణించిన అన్నదాతలకు పరిహారం, లఖింపూర్ ఖేరీలో రైతులపై కారు దాడి వంటి ఘటనలను కూడా సమావేశంలో చర్చించామని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ వెల్లడించారు.
ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 24న జరిగే కేంద్ర కేబినెట్ భేటీలోనే వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి తీర్మానం చేయనున్నట్లు సమాచారం. అయినప్పటికీ సాగు చట్టాల రద్దుపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
పీఎంకేర్స్ నుంచి సహాయం అందించండి..
‘కేంద్ర ప్రభుత్వం తమ తప్పిదాన్ని ఒప్పుకొని సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో వీటికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతోన్న నిరసనల్లో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రైతు సంఘాలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దిల్లీ సరిహద్దులో కొనసాగిన ఆందోళనల సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతులతోపాటు లఖింపూర్ కారు దాడిలో మరణించిన వారికి పీఎం కేర్స్నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలి’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. పీఎం కేర్స్లో లెక్కకు రాని డబ్బు ఎంతో ఉందని ఆరోపించిన ఆయన.. కేవలం రైతులకు క్షమాపణ చెబితే సరిపోదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక