India Corona: ప్రమాదకరంగా విస్తరిస్తోన్న కరోనా.. వారం రోజుల్లో ఐదు రెట్లు పెరిగిన కొత్త కేసులు..!
దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వారం వ్యవధిలో కేసులు సమారు ఐదు రెట్లు అదనంగా నమోదయ్యాయి.
1700కు పెరిగిన ఒమిక్రాన్ బాధితులు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. వారం వ్యవధిలో కేసులు సమారు ఐదు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత సోమవారం 6,358 కరోనా కేసులు రాగా.. ఈ సోమవారం ఆ సంఖ్య 33 వేలకు పెరిగింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోన్న సమయంలో ఈ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇది కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. దాంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షల వైపు మొగ్గుచూపుతున్నాయి.
⇒ ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,700కి చేరింది. 24 గంటల వ్యధిలో 175 కొత్త కేసులొచ్చాయి. ఒక్క మహారాష్ట్రలోనే 510 కొత్త రకం కేసులున్నాయి. నిన్న అక్కడ 50 మంది దీని బారినపడ్డారు. తర్వాతి స్థానంలో దిల్లీ ఉంది. దేశ రాజధానిలో ఒమిక్రాన్ కేసులు 351గా ఉన్నాయి. ఇప్పటివరకు 639 మంది కోలుకున్నారు. అలాగే 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించింది.
నిన్న సెలవురోజు కావడంతో 8.78 లక్షల నిర్ధారణ పరీక్షలే నిర్వహించారు. పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ.. 33,750 మందికి కరోనా సోకినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధిక కేసులు ఉన్నాయి. అక్కడ 11,877 మందిలో వైరస్ నిర్ధారణ అయింది. ఇక దేశంలో మొత్తం కేసులు 3.49 కోట్లకు చేరాయి. క్రియాశీల కేసులు 1,45,582కి ఎగబాకాయి. నిన్న 10వేల మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.42 కోట్లుగా ఉన్నాయి. క్రియాశీల రేటు 0.42 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.20 శాతానికి పడిపోయింది. 24 గంటల వ్యవధిలో 123 మంది మరణించారు. ఇప్పటివరకు 4,81,893 మంది మహమ్మారికి బలయ్యారు.
మరోపక్క దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఈ కార్యక్రమం మరో దశలోకి అడుగుపెట్టింది. ఈ రోజు నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయస్సువారు టీకా తీసుకుంటున్నారు. వారికి కొవాగ్జిన్ టీకాను మాత్రమే వేస్తున్నారు. అలాగే నిన్న దేశం మొత్తం మీద 23,30,706 మంది టీకా తీసుకున్నారు. నిన్నటివరకు 145.6కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
సహజ వ్యాక్సిన్ అనుకోవడం ప్రమాదకరమే..!
యావత్ ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తున్నప్పటికీ దాని వల్ల వ్యాధి తీవ్రత, ఆస్పత్రి ముప్పు తక్కువేనని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ సహజ వ్యాక్సిన్గా దోహదం చేస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ నేచురల్ వ్యాక్సిన్గా పనిచేస్తుందనే ఆలోచన ప్రమాదకరమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘ కొవిడ్ (Long Covid) పర్యవసానాలపై స్పష్టత లేనందున అటువంటి ఆలోచన మంచిది కాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?