Omicron Variant: ఒమిక్రాన్.. డెల్టాను మించి వ్యాపిస్తుందా?
ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారత్లో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయాన్ని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ లోపే ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. అయితే ఈ కొత్త వేరియంట్ డెల్టాను మించి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి.
వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..?
జోహెన్నస్బర్గ్: ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారత్లో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయాన్ని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ లోపే ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. అయితే ఈ కొత్త వేరియంట్ డెల్టాను మించి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఆ ఆస్కారం లేకపోలేదని దక్షిణాఫ్రికాకు చెందిన కమ్యూనికబుల్ డిసీజెస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అడ్రియన్ పూరెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘ అంచనాలకు తగ్గట్టే డెల్టాను మించి ఒమిక్రాన్ వ్యాపిస్తే.. కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాంతో వైద్యసేవలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. టీకాలు, ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చిన రోగనిరోధక శక్తిని ఈ కొత్త వేరియంట్ ఏమేరకు ఏమార్చగలదో నాలుగు వారాల్లోగా శాస్త్రవేత్తలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అలాగే ఇతర వేరియంట్ల కంటే తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయో లేదో గుర్తించాలన్నారు.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ బాధితుల్లో స్వల్పస్థాయి లక్షణాలు కనిపించినట్లు అక్కడి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై ఇప్పుడే ఒక అంచనాకు రావొద్దని వైద్య నిపుణులు సూచించారు. అలాగే ఆ దేశంలోని గాటెంగ్ ప్రావిన్స్లో వేగంగా కేసులు పెరుగున్న నేపథ్యంలో.. డెల్టాను ఈ వేరియంట్ భర్తీ చేసిందనే వాదనపై ఒక అభిప్రాయానికి రావడం కూడా తొందరపాటే అవుతుందని పూరెన్ అన్నారు .
ఇదిలా ఉండగా.. డెల్టా వేరియంట్ కారణంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే కరోనా మూడో వేవ్ను ఎదుర్కొంది. ఆ సమయంలో గరిష్ఠంగా ఒక్కరోజే 26 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ఒమిక్రాన్ నాలుగో వేవ్కు కారణమవుతుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. వేగంగా పెరుగుతున్న కేసులే ఆ ఆందోళనకు కారణం. మరోపక్క, దేశవ్యాప్తంగా కొత్త కేసులు పెరుగుతున్నాయని, ఒమిక్రాన్ కంటే ముందే ఈ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని మరో వైద్య నిపుణుడు పేర్కొన్నారు. ఆ దేశంలో ఇప్పటివరకు సుమారు 30 లక్షల కొత్త కేసులు, 89 వేలకు పైగా మరణాలు సంభవించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?