Booster Dose: బూస్టర్ డోసు వినియోగానికి WHO సిఫార్సు..!
బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది.
ముందుగా వారికే ఇవ్వాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా: కరోనా వ్యాక్సిన్ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ వెల్లడించింది. బూస్టర్ డోసుల వినియోగం గురించి ఇమ్యూనైజేషన్పై ఏర్పాటైన వ్యూహాత్మక సలహాల నిపుణుల బృందం (SAGE) నాలుగు రోజులు చర్చించిన అనంతరం ఈ సిఫార్సు చేసింది. వీటికి సంబంధించిన తుది నివేదిక డిసెంబరులో విడుదల చేస్తామని ప్రకటించింది.
‘రోగనిరోధక వ్యవస్థ మధ్యస్థాయి నుంచి తీవ్ర బలహీనంగా ఉండే వ్యక్తులకు రెండు డోసులు ఇచ్చినప్పటికీ వాటికి తగిన విధంగా స్పందించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో బలహీన రోగనిరోధకత ఉన్నవారు తీవ్ర కొవిడ్-19 బారినపడే ప్రమాదం ఉంటుంది. అందుచేత డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందిన వ్యాక్సిన్ డోసులకు అదనంగా మరో డోసు ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం పేర్కొంది. ఇక చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్ వ్యాక్సిన్లు తీసుకున్న 60ఏళ్ల పైబడిన వ్యక్తులు తప్పనిసరిగా మూడో డోసు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీటితో పాటు ఇతర వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ఆయా దేశాలు మూడో డోసు అందించవచ్చని సూచించింది. అయితే, దీన్ని అమలు చేసే ముందు.. రెండు డోసులు ఎక్కువ మందికి చేరిన తర్వాత మాత్రమే మూడో డోసుపై ఆలోచించాలని పేర్కొంది. వ్యాక్సిన్ పంపిణీలో తొలుత వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం సిఫార్సు చేసింది.
ఇక ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 40శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందించడంతో పాటు వచ్చే ఏడాది జూన్ నాటికి 70శాతం మందికి వ్యాక్సిన్ పూర్తిచేసేలా అన్ని దేశాలు ప్రయత్నించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ పంపిణిలో వృద్థులకు, ఆరోగ్య కార్యకర్తలకు, అధిక ముప్పు పొంచివున్న వారికి తొలుత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అనంతరం సాధారణ పౌరులకు, యుక్తవయసు వారికి వ్యాక్సిన్ ఇచ్చే క్రమాన్ని అనుసరించాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఇదిలాఉంటే, బూస్టర్ డోసు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సిఫార్సు చేసినప్పటికీ.. ఇప్పటికే పలు దేశాలు మూడో డోసు పంపిణీ మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్, అమెరికాతో పాటు యూరప్లోని పలు దేశాలు బూస్టర్ డోసును అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లు పెరగడం, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసు ఇస్తున్నట్లు సమర్థించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బూస్టర్ డోసు వినియోగానికి సిఫార్సు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
జమ్మూ-కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో అయిదుగురు జవాన్లు గాయపడ్డారు. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. -
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా ముందస్తు కుట్రేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. -
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి భాజపా చేసే విమర్శలను ఆప్(AAP) తిప్పికొట్టింది. తనవారి కోసమే ఆ పార్టీ పని చేస్తుందని దుయ్యబట్టింది. -
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఏకంగా 25 కిలోల బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన అధికారులను షాక్కు గురిచేసింది. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
తన కుమారుడు నామినేషన్ వేసిన సందర్భంగా భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ (Brij Bhushan) తన బలాన్ని ప్రదర్శించారు. వేల సంఖ్యలో మద్దతుదారులతో భారీ సభను నిర్వహించారు. -
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
Hamida Banu: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా? అందులో కన్పిస్తున్న వ్యక్తి భారత మహిళా రెజ్లర్ హమీదా బాను. ఇంతకీ ఎవరామే? ఏంటామె ప్రత్యేకత? -
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
ముందు రాయ్బరేలీలో గెలువు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి తాను చేసిన పోస్టుపై గ్యారీ కాస్పరోవ్ (Garry Kasparov) వివరణ ఇచ్చారు. -
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
కేరళలోని కొచ్చిన్లో ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసిరేసింది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో శుక్రవారం ఉదయం శిశువుకు జన్మనిచ్చింది. -
వీఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విశ్వవిద్యాలయంలో 2024 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. -
దిగుతుండగా కూలిన హెలికాప్టర్
శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. -
దిల్లీ మద్యం విధానం కేసులో మరో అరెస్టు
దిల్లీ మద్యం విధానంతో ముడిపడిన నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. -
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాలి
మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకొనే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్ 85, 86 దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సహనమే వివాహబంధానికి పునాది
పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో... స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. -
కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం
దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘ రాహుల్గాంధీ’ పేరుందని పోటీ వద్దంటే ఎలా?
ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై పిటిషన్ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. -
రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వండి
పార్కులో ఉదయపు నడకకు వెళ్లిన వ్యక్తి.. వీధి కుక్కల దాడిలో గాయపడి మరణించిన ఘటనలో బాధితుడి కుటుంబసభ్యులకు రూ.7.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఆదేశించింది. -
ఛత్తీస్గఢ్లో చెట్టును ఢీకొన్న బీఎస్ఎఫ్ సిబ్బంది బస్సు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది సిబ్బంది గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు