Ambidextrous: ఆ పాఠశాలలో అందరూ సవ్యసాచులే.. రెండు చేతులతో రాస్తారు మరి..
మధ్యప్రదేశ్లోని ఓ మారుమూల పాఠశాల రెండు చేతులతో రాయడంలో తర్ఫీదునిస్తోంది........
ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న మారుమూల స్కూల్
ఇంటర్నెట్ డెస్క్: బాగా చదవాలి.. ఉత్తమ ర్యాంకు సాధించాలి.. ఏ పాఠశాలలోనైనా ప్రాథమిక అంశాలు ఇవే. కానీ మధ్యప్రదేశ్లోని ఓ స్కూల్ మాత్రం ఇందుకు డిఫరెంట్. ఆ పాఠశాలలో చేరితే రెండు చేతులతో రాయడం నేర్చుకోవాల్సిందే. ఇక్కడ ఇదే ప్రాథమిక అంశం. ఆధిపత్య హస్తం అనే భావనను సవాలు చేస్తూ.. రెండు చేతులతో రాయడం నేర్పిస్తున్న దేశంలోని ఏకైక పాఠశాలగా నిలిచింది సింగ్రౌలీ జిల్లాలోని వీణావాదిని పబ్లిక్ స్కూల్. మారుమూల బుధేలా గ్రామంలో ఉంటుందీ పాఠశాల.
దేశ తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ రెండు చేతులతో రాసేవారు. పలు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న మాజీ సైనికుడు వీపీ.శర్మ రెండు చేతులతో రాయడం సాధన చేశారు. విజయవంతం కావడంతో ఈ విద్యను అనేక మందికి నేర్పాలని నిశ్చయించుకున్నారు. వీపీ.శర్మ సంకల్పంతో 1999లో ఆయన స్వగ్రామంలో ఏర్పాటైందే వీణావాదిని పబ్లిక్ స్కూల్.
1వ తరగతి నుంచే సాధన
1వ తరగతి నుంచే ప్రతి విద్యార్థి రెండు చేతులా రాసేలా సాధన చేయిస్తారు అక్కడి ఉపాధ్యాయులు. వారు మూడో తరగతికి వచ్చేలోపు పూర్తిస్థాయిలో సవ్యసాచిగా మారిపోతారని పాఠశాల గురువులు పేర్కొంటున్నారు. ఎలాంటి ఇబ్బంది, తడబాటు లేకుండా అలవోకగా ఒకేసారి రెండు చేతులతో రాస్తారని తెలుపుతున్నారు. ఎవరైనా విద్యార్థి కొత్తగా స్కూళ్లో చేరితే మొదటి నెల రోజులపాటు వారు ఏ చేతితో రాస్తారో, ఆ చేతితో రాసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తారు. అనంతరం మరో చేతితో రాయడంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తారు. మరికొన్ని నెలల తర్వాత రెండు చేతులతో రాయడాన్ని సాధన చేయిస్తారు. ప్రతి 45 నిమిషాల క్లాసులో.. తప్పనిసరిగా 15 నిమిషాలను ఆ సబ్జెక్ట్లో రైటింగ్ ప్రాక్టీస్కే కేటాయిస్తారు.
6 విభిన్న భాషల్లో తర్ఫీదు
అంతే కాదండోయ్.. భాషల పట్ల మక్కువ పెంచేందుకు విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం సహా అరబిక్, రోమన్ వంటి ఆరు విభిన్న భాషల్లో రాయడం నేర్పిస్తున్నారు. స్కూల్లోని అనేకమంది విద్యార్థులు రెండు వేర్వేరు స్క్రిప్ట్లను ఒకేసారి, పూర్తిస్థాయి వేగంతో రాయగలరు. అదనంగా, విద్యార్థుల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు పదును పెట్టేలా యోగాతోపాటు క్రీడలను పాఠ్యాంశాల్లో అంతర్భాగం చేశారు.
విద్యార్థులపై పరిశోధకుల అధ్యయనాలు
ఈ ప్రత్యేకమైన పాఠశాల దేశం దృష్టినే కాదు.. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల పరిశోధకులు ఈ స్కూల్ను సందర్శించి.. విద్యార్థులు నేర్చుకునే విధానం, వారి ప్రతిభాపాటవాలను తెలుసుకున్నారు. వీరిపై అధ్యయనం చేస్తున్నారు. సాధారణ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షల్లోనూ మిగతా వారితో పోలిస్తే ఇక్కడి విద్యార్థులు మెరుగ్గా రాణిస్తుండటం విశేషం. ఇతర విద్యార్థుల కంటే అధిక వేగంతో రాస్తున్నారు. వీణావాదినిలో 8వ తరగతి వరకే ఉంటడంతో.. అక్కడ విద్య పూర్తిచేసుకొని ఇతర పాఠశాల్లో చేరినవారు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!