త్రిపుర సీఎంకు కరోనా

అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేబ్ కు కరోనా

Published : 07 Apr 2021 18:54 IST

అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేబ్ కరోనా బారిన పడినట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. కరోనా ఆర్‌టి-పీసీఆర్‌ టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. అందరూ కరోనా నిబంధనలు పాటించి, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకూ 33,554 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 389 మరణాలు సంభవించాయి. 33,069 మంది రికవరీ అయ్యారు. రికవరీ రేటు 98.63 శాతానికి చేరుకుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం మరణాల రేటు 1.16 శాతంగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు