కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో గుర్తింపుపై మరో అడుగు!
కొవాగ్జిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) గుర్తింపు విషయంలో మరో అడుగు ముందుకు పడింది! కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం డబ్ల్యూహెచ్వో ముఖ్య శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో గుర్తింపు అంశంపై చర్చించినట్లు మంత్రి ట్విటర్ వేదికగా వెల్లడించారు.
దిల్లీ: కొవాగ్జిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) గుర్తింపు విషయంలో మరో అడుగు ముందుకు పడింది! కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం డబ్ల్యూహెచ్వో ముఖ్య శాస్త్రవేత్త డా.సౌమ్య స్వామినాథన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో గుర్తింపు అంశంపై చర్చించినట్లు మంత్రి ట్విటర్ వేదికగా వెల్లడించారు. మహమ్మారి కట్టడికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆమె ప్రశంసించినట్లు తెలిపారు. భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన ఈ టీకా.. ఇటీవల హంగేరి దేశానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, న్యూట్రిషన్ నుంచి గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్(జీఎంపీ) గుర్తింపు పత్రం పొందిన విషయం తెలిసిందే. మరోవైపు కొవాగ్జిన్, కొవిషీల్డ్ మిశ్రమంతో వైరస్ కట్టడిలో మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నట్లు ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. -
సంపద అంటే డబ్బు ఒక్కటే కాదు
సంపదలో నాలుగు రకాలు. ఆర్థికం: మన అవసరాలను తీర్చుకొనే వెసులుబాటు కల్పించేది. సామాజికం: గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేది. -
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.