Nityanand Rai: కేంద్ర మంత్రి నిత్యానందరాయ్‌కు కరోనా

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ కరోనా బారిన పడ్డారు.తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, హోం...

Published : 06 Jan 2022 20:00 IST

దిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ కరోనా బారిన పడ్డారు.తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు, తనను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు జాగ్రత్త వహించాలని హిందీలో ట్వీట్‌ చేశారు. బుధవారం కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) చీఫ్‌లు హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న రాయ్‌ సీఏపీఎఫ్‌ సిబ్బందికి ఆయుష్మాన్‌ హెల్త్‌ కార్డులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ చీఫ్‌లు పాల్గొన్నారు. ఐజీ ర్యాంక్‌ అధికారి అధ్యక్షత వహించారు. కార్యక్రమం జరిగిన మరుసటి రోజునే కేంద్ర మంత్రికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని