Savji Dholakia: ఈయన మనసు విలువైన ‘వజ్రం’.. అందుకే వరించింది ‘పద్మం’
చేసేది వజ్రాల వ్యాపారం.. అందుకేనేమో ఆయన మనసు కూడా ఆ వజ్రమంత గొప్పది. ‘సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలి. లేదంటే లావైపోతాం’ అని ఓ సినిమాలో
ఇంటర్నెట్డెస్క్: చేసేది వజ్రాల వ్యాపారం.. అందుకేనేమో ఆయన మనసు కూడా ఆ వజ్రమంత విలువైనది. ‘సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలి. లేదంటే లావైపోతాం’ అని ఓ సినిమాలో చెప్పిన వాక్యం.. ఈయనకు అచ్చంగా సరిపోతుంది. తాను ఈ స్థాయికి రావడానికి కష్టంతో పాటు తన కింద పనిచేసే ఉద్యోగుల కృషి కూడా ఉందని భావించే ఆయన.. ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సిబ్బందికి ఖరీదైన కానుకలు అందిస్తున్నారు. అంతేనా, పేదవారికి కూడా తనవంతు సాయం చేస్తూ సమాజం రుణం తీర్చుకుంటున్నారు. అందుకే ఆయన మంచి మనసుకు ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. ఆయనే గుజరాత్కు చెందిన సావ్జీ ఢోలాకియా..!
నాలుగో తరగతితో చదువు ఆపేసి..
గుజరాత్లోని అమ్రేలి జిల్లా దుధాలా గ్రామంలో 1962 ఏప్రిల్ 12న ఓ రైతు కుటుంబంలో సావ్జీ ఢోలాకియా జన్మించారు. చిన్నప్పటి నుంచి చదువు అంతంత మాత్రమే. అందుకే 13 ఏళ్ల వయసులో 4వ తరగతితోనే చదువు ఆపేశారు. తన మేనమామ దగ్గర పనికోసం 1977లో సూరత్ వచ్చారు. అప్పుడు ఆయన జేబులో రూ.12.5 మాత్రమే ఉన్నాయట. కొన్నేళ్ల పాటు సావ్జీ, ఆయన సోదరులు మేనమామ దగ్గరే వజ్రాల పాలిషింగ్ వర్క్ నేర్చుకున్నారు. ఆ తర్వాత 1984లో సొంతంగా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు.
తొలినాళ్లలో వీరి వ్యాపారం కూడా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఆ తర్వాత క్రమంగా సావ్జీ నిలదొక్కుకుని.. వ్యాపారంలో ఎదుగుతూ వచ్చారు. 1992లో ముంబయిలో శ్రీ హరికృష్ణ ఎక్స్పోర్ట్స్ పేరుతో వజ్రాల ఎగుమతులను కూడా ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కి చూసుకునే అవసరం రాలేదు. 2014లో సావ్జీ కంపెనీ టర్నోవర్ ఏకంగా 104శాతం పెరిగి రూ.400కోట్లు దాటింది. ప్రస్తుతం సావ్జీ.. దేశంలోనే ప్రధాన వజ్రాల ఎగుమతిదారు కాగా.. ఈయన కంపెనీలో దాదాపు 6500 మంది పనిచేస్తున్నారు. కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.6వేల కోట్లకు పైమాటే. 50కి పైగా దేశాలకు ఈయన వజ్రాలను ఎగుమతి చేస్తుంటారు. అమెరికా, బెల్జియం, యూఏఈ, హాంకాంగ్, చైనాల్లోనూ అనుబంధ సంస్థలున్నాయి.
సిబ్బందికి ప్రేమతో..
అయితే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తన వద్ద పనిచేసే వారికి తిరిగి ఇవ్వాలనే సిద్ధాంతాన్ని సావ్జీ బలంగా నమ్ముతారు. అందుకే ఏటా సిబ్బంది కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానుకలు అందిస్తున్నారు. 2011లో సావ్జీ పేరు తొలిసారిగా వార్తల్లో వచ్చింది. దీపావళి కానుకగా తన సిబ్బందికి ఖరీదైన బహుమతులతో పాటు బోనస్ కూడా అందించారు. ఆ తర్వాత 2015లో సిబ్బందికి 491 కార్లు, 200లకు పైగా ఫ్లాట్లను బహుమతిగా ఇచ్చారు. 2018లో ఏకంగా 1500 మంది ఉద్యోగులకు ఖరీదైన కానుకలు అందించారు. ఇందులో 600 మందికి కార్లు, 900 మందికి ఫిక్స్డ్ డిపాజిట్లు అందించారు. వీటిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అందించడం విశేషం. దీంతో సావ్జీ పేరు దేశమంతా మార్మోగింది.
అంతేకాదండోయ్.. పేద యువతులకు పెళ్లిళ్లు చేయడం, విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం వంటివి కూడా చేస్తుంటారు. ఆయన సేవలకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారంతో అభినందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?