దానికి ఎంతో ధైర్యం కావాలి: అనుష్క
‘జేజమ్మ’.. ‘దేవసేన’.. ‘భాగమతి’.. అంటూ ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకున్న కథానాయిక అనుష్క. ఆమె సరికొత్త కథతో తెరకెక్కించిన ‘నిశ్శబ్దం’తో అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది. హేమంత్ మధుకర్....
ఓటీటీలో ‘నిశ్శబ్దం’.. మీడియాతో దేవసేన ముచ్చట్లు
హైదరాబాద్: ‘జేజమ్మ’.. ‘దేవసేన’.. ‘భాగమతి’.. అంటూ ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకున్న కథానాయిక అనుష్క. ఆమె సరికొత్త కథతో తెరకెక్కించిన ‘నిశ్శబ్దం’తో అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాధవన్, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, మైఖేల్ ప్రధాన పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై కోన వెంకట్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా అనుష్క మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
నమ్మకం ఏర్పడి..
‘‘భాగమతి’ సినిమా పూర్తయిన తర్వాత కావాలని విరామం తీసుకున్నా. అప్పుడు కోన వెంకట్ గారు నన్ను సంప్రదించారు. హేమంత్ మధుకర్ గారితో ‘నిశ్శబ్దం’ కథను నరేట్ చేయించారు. ఆయన కథ చెప్పగానే విభిన్నంగా ఉంది అనిపించింది. అంతేకాదు సినిమాకు వర్కౌట్ అవుతుందనే నమ్మకం నాలో ఏర్పడింది. ఆ కారణంతోనే ఈ సినిమాకు సంతకం చేశా. నిజానికి అనుకోకుండా నా వద్దకు వచ్చిన కథ ఇది’.
ఒప్పుకోవడానికి కారణం అదే..
‘‘నిశ్శబ్దం’లో నా పాత్రకు మాటలు లేవు. వినికిడి లోపం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని హేమంత్ ముందుగానే చెప్పారు. నేను ఈ సినిమాకు ఒప్పుకోవడానికి కారణం కూడా నా పాత్ర ప్రత్యేకతే. దీని కోసం నేను కొన్ని రోజులు ఇండియన్ సైన్ లాంగ్వెజ్ నేర్చుకున్నా. అయితే ఆ తర్వాత షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన తర్వాత సైన్ లాంగ్వేజ్ వేరుగా ఉంటుందని తెలిసింది. ఇంటర్నేషనల్గా అందరూ ఎక్కువుగా వాడే సైన్ లాంగ్వేజ్ కూడా అదే. దీంతో అమెరికాలో 14 ఏళ్ల అమ్మాయి దగ్గర ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్లో శిక్షణ తీసుకున్నా’.
లోపం ఇదే..
‘సినిమాను ఓటీటీలో విడుదల చేయడం వల్ల ఓ సమస్య ఉంది. థియేటర్లో సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. కానీ ఓటీటీలో దాన్ని మిస్ అవుతారు. అయితే.. హెడ్ ఫోన్స్, హోమ్ థియేటర్లు ఈ లోపాన్ని దాదాపు కవర్ చేస్తాయి. ‘నిశ్శబ్దం’కు సంగీతం ప్రధాన బలం. గోపీ సుందర్ ఇచ్చిన బాణీలు సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి’.
ఎంజాయ్ చేస్తారు..
‘నా కెరీర్ తొలినాళ్లలో మాధవన్ గారితో కలిసి నటించా. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. మేమిద్దరం ఈ చిత్రంలో సవాలుతో కూడుకున్న పాత్రలు చేశాం. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంది. కేవలం ఇద్దరి చుట్టూ తిరిగే కథ ఇది కాదు. స్క్రీన్ప్లేను ముందుకు నడిపించడంలో మిగిలిన పాత్రలు కూడా కీలకంగా మారుతుంటాయి. ఈ థ్రిల్లింగ్ రైడ్ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని కచ్చితంగా చెప్పగలను’.
మార్పు అవసరం..
‘ఓటీటీ, థియేటర్.. రెండు వేర్వేరు. పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఓటీటీలో చిత్రాల్ని విడుదల చేయడాన్ని కూడా ప్రజలు స్వాగతించాలి. కరోనా నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే.. సాంకేతికంగా ప్రేక్షకులకు వినోదం పంచడం అవసరం. మొదటిసారి నేను నటించిన సినిమా ఇలా ఓటీటీలో విడుదల కాబోతుండటం నాకు కాస్త కొత్తగా అనిపిస్తోంది. మా ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు కూడా స్వాగతిస్తారని ఆశిస్తున్నా’.
ధైర్యం కావాలి..
‘హేమంత్ పూర్తి క్లారిటీతో ఈ సినిమాను తెరకెక్కించారు. తనకు కావాల్సిన దాన్ని నటుల నుంచి రాబట్టుకుంటాడు. అది ఆయన ప్రత్యేకత. ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రయోగాత్మక కథను అమెరికా నేపథ్యంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అది అంత సులభం కాదు. దానికి ప్యాషన్, ధైర్యం కావాలి. అక్టోబరు 2న సినిమా విడుదలౌతోంది. మీరంతా దాన్ని చూసి, ఆదరించాలని కోరుకుంటున్నా’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!