గద్వాల్‌ సంస్థానంలో మాహిష్మతి రాణి

గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. రష్మి వ్యాఖ్యాతగా రోజా, మనో న్యాయనిర్ణేతలుగా కొనసాగుతోన్న ఈ కామెడీ షోలో తాజాగా అరుంధతి, బాహుబలి చిత్రాలకు సంబంధించిన స్ఫూప్‌తో జీవన్‌ స్కిట్‌ చేయనున్నారు..

Updated : 02 Nov 2020 09:33 IST

దేవసేనను చూసి కంగారుపడ్డ పశుపతి

హైదరాబాద్‌: గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. రష్మి వ్యాఖ్యాతగా రోజా, మనో న్యాయనిర్ణేతలుగా కొనసాగుతోన్న ఈ కామెడీ షోలో తాజాగా అరుంధతి, బాహుబలి చిత్రాలకు సంబంధించిన స్ఫూప్‌తో జీవన్‌ స్కిట్‌ చేశారు.

‘బతికుండగానే పశుపతిని సమాధి చేసిన అరుంధతిలో జేజేమ్మ కాలక్రమేణ ‘బాహుబలి’లో దేవసేనగా మారింది’ అనే వాయిస్‌తో ఈ స్కిట్‌ ప్రారంభమైంది. దేవసేనగా ‘పటాస్‌’ ఫహీమా, పశుపతిగా జీవన్ వేసిన గెటప్‌లు, పంచులు, వారిద్దరి హావభావాలు న్యాయనిర్ణేతలను మెప్పించాయి. మరోవైపు రాకేష్ ఎప్పటిలాగానే చిన్నపిల్లలతో అలరించగా సుధీర్‌, రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను ఆటో పంచులు, విభిన్నమైన వేషధారణలతో ఆకట్టుకున్నారు. వచ్చే శుక్రవారం (నవంబర్‌ 6) ప్రసారం కానున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోమో చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని