ఐటెమ్ సాంగుల్లోకి.. మాస్ గుండెల్లోకి
చిత్ర విజయంలో ప్రత్యేక గీతానికి ఓ స్థానముంటుంది. రెండుమూడు గంటల చిత్రంతో లభించే గుర్తింపు, పారితోషకం ఐదారు నిమిషాల ఐటెమ్ పాట తెచ్చిపెడుతోందనేది నేటి కథానాయికల మాట. అందుకే అగ్ర కథానాయికలూ....
చిత్ర విజయంలో ప్రత్యేక గీతానికి ఓ స్థానముంటుంది. రెండుమూడు గంటల చిత్రంతో లభించే గుర్తింపు, పారితోషకం ఐదారు నిమిషాల ఐటెమ్ పాట తెచ్చిపెడుతోందనేది నేటి కథానాయికల మాట. అందుకే అగ్ర కథానాయికలూ వీటికి సై అంటుంటారు. తమ అందం, నృత్యంతో కనువిందు చేస్తుంటారు. ఇప్పటికే చాలామంది నాయికగా కొనసాగుతూనే స్పెషల్ సాంగ్లో నర్తించి మెప్పించారు. మేము సైతం అంటూ ఇప్పుడా జాబితాలోకి మరికొందరు చేరుతున్నారు.
‘శివ మనసులో శ్రుతి’ అంటూ తొలి చూపులోనే అందరిని కట్టిపడేసింది రెజీనా కసాండ్రా. ఓ వైపు ప్రేమ కథా చిత్రాలు, మరో వైపు థ్రిల్లర్ సినిమాలు చేస్తూ అగ్ర కథా నాయకుడు చిరంజీవి పక్కన చిందేసే అవకాశం అందుకుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో వేడుక నేపథ్యంలో వచ్చే గీతంలో నర్తించింది. రెజీనా తన అందంతో వేడిక్కించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను 2021 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగులో తొలిసారి..
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలాకు ప్రత్యేక గీతాలు కొత్తేమీ కాదు. హిందీ, బెంగాలీ చిత్రాల్లోని ఐటెం పాటలకు నర్తించిన ఊర్వశి ‘బ్లాక్ రోజ్’తో తెలుగు టాలీవుడ్కి పరిచయం కాబోతుంది. మోహన్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అనే పాటకు స్టెప్పులేసి కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో ప్రత్యేక గీతం కోసం చేస్తున్న అన్వేషణలో ఈమె పేరు వినిపిస్తోంది.
‘భూమ్ బద్దల్’ చేసేలా..
రవితేజ కథానాయకుడుగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ‘క్రాక్’లో అవకాశం అందుకుంది అప్సర రాణి. ‘భూమ్ బద్దల్’ అనే పాటలో రవితేజతో చిందులేసిందీ అమ్మడు. ఈ పాట ఇప్పటికే 10మిలియన్ వ్యూస్ దాటేసింది. కెరీర్ ఆరంభంలో ‘4 లెటర్స్’, ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రాల్లో నటించింది. రామ్ గోపాల్ వర్మ తీసిన ‘థ్రిల్లర్’ వెబ్ సిరీస్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూనే తొలిసారి ఐటెమ్ గీతంలో ఆడిపాడింది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదలచేయాలని ఉన్నారు.
‘హీట్ పెంచేందుకు’...
‘అలా ఎలా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హెబ్బా పటేల్ ‘కుమారి 21 ఎఫ్’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యువతలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ‘రెడ్’ చిత్రంలోని ‘డిచక్ డిచక్’ అనే హుషారెత్తించే గీతంలో నర్తించింది. యువ కథానాయకుడు రామ్తో కలిసి స్టెప్పులేసి పల్స్ రేట్ పెంచేస్తుందని అభిమానులంటున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 సంక్రాంతికి రాబోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్