అప్పట్లో భయపడ్డా: ఇలియానా

‘దేవదాసు’ చిత్రంతో కథానాయికగా పరిచయమై.. ‘పోకిరి’తో సూపర్‌ హిట్‌ విజయాన్ని సొంతం చేసుకుని అనంతరం బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు నటి ఇలియానా. ‘పాగల్‌పంతీ’ చిత్రం తర్వాత ఆమె కథానాయికగా తెరకెక్కుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’....

Published : 26 Nov 2020 14:09 IST

ముంబయి: ‘దేవదాసు’ చిత్రంతో కథానాయికగా పరిచయమై.. ‘పోకిరి’తో సూపర్‌ హిట్‌ విజయాన్ని సొంతం చేసుకుని అనంతరం బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు నటి ఇలియానా. ‘పాగల్‌పంతీ’ చిత్రం తర్వాత ఆమె కథానాయికగా తెరకెక్కుతున్న బాలీవుడ్‌ చిత్రం ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’. బల్వీందర్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌దీప్‌ హుడా కీలకపాత్రలో కనిపించనున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొనడంపై నటి ఇలియానా తాజాగా స్పందించారు.

‘షూటింగ్‌ కారణంగా తిరిగి ముంబయి వచ్చేశాను. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌లో పాల్గొంటున్నాం. దాదాపు షూటింగ్‌ పూర్తికావొచ్చింది. కరోనా కారణంగా షూటింగ్‌లో పాల్గొన్న మొదటిరోజు కొంచెం భయపడ్డాను. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు అందరం కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నాం. సెట్‌లో సరైన జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇప్పుడు అలవాటు అయ్యింది’

‘చాలాకాలం గ్యాప్‌ తర్వాత షూటింగ్‌ తిరిగి ప్రారంభించిన సమయంలో నా పాత్ర మర్చిపోయానేమోననే అనుమానం వచ్చింది. చిత్రీకరణకు వెళ్లే ముందు కొంచెం ప్రాక్టీస్‌ చేస్తే బాగుంటుందని నేనూ, దర్శకుడు అనుకున్నాం. కానీ, కెమెరా ముందుకు వెళ్లగానే.. సహజంగానే పాత్రలోకి లీనమైపోయాను. నిజం చెప్పాలంటే బ్రేక్‌ వల్లే ఇంకా బాగా నటించగలుగుతున్నాను’ అని ఇలియానా వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని