మీటూ.. బాలీవుడ్‌లో అలాంటి వాళ్లే ఎక్కువ:కంగన

హిందీ చిత్ర పరిశ్రమతోపాటు అక్కడి మనుషుల గురించి నటి కంగనారనౌత్‌ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఇటీవల నటి పాయల్‌ ఘోష్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగన మీటూ...

Published : 21 Sep 2020 23:02 IST

వారి సంతోషం కోసం రోజుకో కొత్త అమ్మాయి

ముంబయి: హిందీ చిత్ర పరిశ్రమతోపాటు అక్కడి మనుషుల గురించి నటి కంగనారనౌత్‌ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఇటీవల నటి పాయల్‌ ఘోష్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగన మీటూ ఉద్యమం గురించి స్పందిస్తూ ట్విటర్‌ వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నకిలీ వివాహాలు చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవారితో బాలీవుడ్‌ నిండిపోయిందని నటి ఆరోపించారు. అంతేకాకుండా మీటూ ఉద్యమం బీటౌన్‌లో విఫలమైందని తెలిపారు.

‘‘మీటూ’ ఉద్యమం బాలీవుడ్‌లో విఫలమయ్యింది. ఎందుకంటే రేపిస్టులు, లైంగికంగా వేధించేవాళ్లు బయటకు మాత్రం ఉదారవాదులుగా కనిపించి ఉద్యమాన్ని నీరుగార్చేశారు. ఇతర బాధితుల మాదిరిగానే పాయల్‌ఘోష్‌ని సైతం తీవ్ర అవమానాలకు గురి చేసి భవిష్యత్తులో మాట్లాడకుండా చేసేస్తారు. నకిలీ వివాహాలు చేసుకుని, రోజుకో అమ్మాయితో సంతోషంగా ఉండాలనుకునే.. లైంగికంగా వేధించేవారితో బాలీవుడ్‌ నిండిపోయింది. అమాయకులైన యువ నటులను కూడా వాళ్లు వేధింపులకు గురిచేస్తారు. అలాంటి వాటన్నింటినీ దాటుకుని ధైర్యంగా నా జీవితాన్ని మార్చుకున్నాను. మీటూ ఉద్యమంతో నాకు అవసరం లేదు. కానీ చాలామంది మహిళలకు అది ఎంతో అవసరం’ అని కంగన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని