రకుల్‌కు కరోనా పాజిటివ్‌

టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ కరోనాకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. తానకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని, ఆరోగ్యం కూడా బాగానే ఉందని ఆమె చెప్పింది.

Updated : 22 Dec 2020 15:09 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ కరోనాకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని, ఆరోగ్యం కూడా బాగానే ఉందని ఆమె చెప్పింది. త్వరలోనే కోలుకొని సినిమా షూటింగ్‌లలో పాల్గొంటానని ధీమా వ్యక్తం చేసింది. ఈ మధ్య తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరింది.
ఈమధ్య బాలీవుడ్‌లో అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో అక్కడే బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోందామె. మరో తెలుగు చిత్రానికి కూడా ఓకే చెప్పింది. వీటితో పాటు ఆమె చేతిలో మూడు హిందీ, రెండు తమిళ సినిమాలున్నాయి. ఇండియన్‌2లోనూ ఆమె నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె ఓ ప్రముఖ ఓటీటీ నిర్వహిస్తున్న టాక్‌షోలో ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

ఆ ఇల్లు నాకెవరూ గిఫ్ట్‌ ఇవ్వలేదు: రకుల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని