‘ఇచ్చట...’ భిన్నమైన చిత్రం

‘‘నటుడిగా నాకెంతో తృప్తినిచ్చిన సినిమా ఇది’’ అన్నారు సుశాంత్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు  నిలుపరాదు’.

Updated : 24 Aug 2021 07:25 IST

‘‘నటుడిగా నాకెంతో తృప్తినిచ్చిన సినిమా ఇది’’ అన్నారు సుశాంత్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు  నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహించారు. రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాతలు. ఈ నెల 27న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కథానాయకుడు నాగార్జున ట్విటర్లో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కథానాయకుడు సుశాంత్‌ మాట్లాడారు. ‘‘కథ వాస్తవానికి దగ్గరగా ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అనుకున్నా. ఇంత మంచి కథని నాకు ఇచ్చిన దర్శన్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు సుశాంత్‌. ‘‘ఈ చిత్ర నిర్మాత రవిశంకర్‌ శాస్త్రి నటి భానుమతి మనవడు. మీరూ,  ఏఎన్నార్‌ మనవడు సుశాంత్‌ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని ఆయనకి చెప్పడంతో వెంటనే ఒప్పుకొన్నారు. సుశాంత్‌ కారణంగానే నేనూ ఈ చిత్రానికి ఓ నిర్మాతనయ్యా. అన్నీ చక్కగా కుదిరిన సినిమా ఇది’’ అన్నారు హరీశ్‌ కోయలగుండ్ల. ఈ కార్యక్రమంలో కృష్ణచైతన్య, సురేష్‌బాబా, వెంకట్‌, అభినవ్‌ గోమటం తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని