అభిమానులూ... మొక్కలు నాటండి

తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలంటూ అభిమానుల్ని అభ్యర్థించారు కథానాయకుడు మహేష్‌బాబు. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్‌ చేశారు.

Updated : 07 Aug 2021 07:08 IST

న పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలంటూ అభిమానుల్ని అభ్యర్థించారు కథానాయకుడు మహేష్‌బాబు. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టా ద్వారా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘నాపై ప్రేమని చూపిస్తూ అభిమానులు ప్రతిసారీ చేసే పనులపై నేనెంతో వినమ్రంగా ఉన్నా. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కి మద్దతుగా ఈసారి మూడు మొక్కలు నాటి, ఆ పోస్టుల్ని సామాజిక మాధ్యమాల్లో నాతో పంచుకోండి. వాటిని నేనూ చూస్తా’’ అంటూ వ్యాఖ్య చేశారు మహేష్‌. ఆయన పిలుపుపై హర్షం వ్యక్తం చేశారు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌. ‘‘ప్రముఖ కథానాయకుడైన మహేష్‌కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వారిచ్చిన ఈ పిలుపు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయనకి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌పై ఉన్న అభిమానానికి నిదర్శనం. మహేష్‌ పేరుతో నాటే మొక్కలు వృక్షాలుగా పెరిగి ఎందరికో నీడనివ్వాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని