ప్రభాస్‌ అభిమానులకు కానుక!

ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆది పురుష్‌’. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతి సనన్‌ నాయిక.

Updated : 20 Apr 2021 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆది పురుష్‌’. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కృతిసనన్‌ నాయిక. శ్రీరామ నవమి కానుకగా ఈ సినిమాకు సంబంధించి ఏప్రిల్‌ 21న ఓ ఆసక్తికర అప్‌డేట్‌ని అందించనుంది చిత్ర బృందం. మరి ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. రామాయణం కథాంశంగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది ఈ చిత్రం. రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి, రావణుడిగా సైఫ్‌ కనిపించనున్నారు. 3డీ వెర్షన్‌లో దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని