Dil Raju: యానిమల్ తరహా చిత్రాల్ని మేమూ నిర్మిస్తాం
యానిమల్ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించిందని నిర్మాత దిల్రాజు తెలిపారు.
యానిమల్ చిత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో తొలిరోజు రికార్డు వసూళ్లు సాధించిందని నిర్మాత దిల్రాజు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.15కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని.. ఈ వారాంతంలోనే రూ.35కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు గ్రాస్ మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారాయన. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమే ‘యానిమల్’. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్రాజు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో శనివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా గ్లోబల్ అయ్యిందని చెప్పడానికి ఈ చిత్ర విజయం ఓ ఉదాహరణ. మన హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్చరణ్ల చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అక్కడి హీరోల సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా చిత్రాలు తీస్తే వాటిని అందరూ ఆదరిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. యానిమల్ తరహా చిత్రాల్ని మా సంస్థలో కూడా నిర్మిస్తాం అన్నారు. అనంతరం దిల్రాజు తమ బ్యానర్లో రూపొందుతోన్న కొత్త సినిమాల గురించి స్పందించారు. ప్రస్తుతం శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్లో నాలుగు సినిమాలు, దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో మూడు చిత్రాలు చేస్తున్నట్లు చెప్పారు. రామ్చరణ్ శంకర్ల కలయికలో నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పటికే 90శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న మహేష్బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్ చిత్రాల్ని నైజాంలో తనే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంక్రాంతికి రావాల్సిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ సినిమాని మార్చిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి