Tollywood: హిట్ కొట్టిన కొత్త కెప్టెన్లు
కొత్తదనానికి చిరునామాగా నిలుస్తుంటారు నవతరం దర్శకులు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో వారెప్పుడూ ముందుంటారు.
2022లో సత్తా చాటిన నవతరం దర్శకులు
కొత్తదనానికి చిరునామాగా నిలుస్తుంటారు నవతరం దర్శకులు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో వారెప్పుడూ ముందుంటారు. అందుకే తెరపై కొత్త ప్రతిభ మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా ఆవైపు ఓ కన్నేస్తుంటారు. గతేడాదిలాగే ఈ ఏడాదీ తెలుగు తెరపై పలువురు కొత్త దర్శకులు అదృష్టం పరీక్షించుకున్నారు. వారిలో కొందరు తొలి అడుగులోనే మెప్పించగా.. మరికొందరి ప్రయత్నాలకు ప్రశంసలు దక్కాయి. మరి ఈ ఏడాది తెరపై మెరిసిన ఆ కొత్త కెప్టెన్లు ఎవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
ఈ ఏడాది తెలుగులో చిన్న, మీడియం రేంజ్ చిత్రాల మెరుపులు బాగా కనిపించాయి. ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam), ‘ఒకే ఒక జీవితం’, ‘స్వాతిముత్యం’, ‘మసూద’ (Masooda) ఇలాంటి చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. ఎన్నో రూ.కోట్లు పోసి తీసిన భారీ చిత్రాలకంటే మిన్నగా ఆకట్టుకున్నాయి. ‘సినిమా తీయాలంటే భారీతనం కాదు.. సరికొత్త ఆలోచనలు ముఖ్యమ’ని ఈ చిత్రాలే నిరూపించాయి. వీటిని నడిపించిన దర్శకులంతా తొలిసారి కెప్టెన్ కుర్చీలో కూర్చున్నవారే. అనుభవం లేకపోయినా.. వాళ్లలో ఉన్న ఉత్సాహం, సాధించాలన్న తపనే ఇంతటి విజయాలు దక్కించుకునేలా చేసింది. ఫిబ్రవరిలో వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు విమల్ కృష్ణ. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. ఒక సింపుల్ ప్రేమకథకు ఓ క్రైమ్ ఎలిమెంట్ను జోడిస్తూ వినోదాత్మకంగా కథనం నడిపిన తీరు సినీప్రియుల్ని అలరించింది. ముఖ్యంగా టిల్లు పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు.. ఆ పాత్రలో సిద్ధు ఒదిగిన విధానం చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. రాధిక పాత్రలో నాయిక నేహా శెట్టి ఆకట్టుకుంది. పెళ్లి, లాక్డౌన్.. ఈ రెండింటినీ ముడిపెడుతూ విద్యా సాగర్ చింతా తెరకెక్కించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. విష్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు చక్కటి విజయాన్నే అందుకొంది. తెలంగాణ అబ్బాయి, ఆంధ్రా అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకోవడం..లాక్డౌన్ వల్ల వాళ్లు అదే ఇంట్లో ఇరుక్కుపోవడం.. ఆ తర్వాత జరిగే రకరకాల పరిణామాలు, రెండు కుటుంబాల మధ్య మొదలైన అలకలు, చిర్రుబుర్రులు.. ఇలాంటి అంశాలతో సరదాగా సాగే ప్రయాణమిది.
తొలి అడుగులోనే అగ్ర హీరోల దృష్టిలో
‘బింబిసార’తో (Bimbisara) తొలి అడుగులోనే అగ్ర కథానాయకుల దృష్టిలో పడ్డారు దర్శకుడు వశిష్ఠ్. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వశిష్ఠ్ ఈ సినిమా కోసం ఓ కొత్త కోణం పట్టుకున్నారు. చరిత్రలో క్రూర రాజుగా ముద్రపడిన బింబిసారుడు మంచి మనిషిగా మారడం వెనుక ఓ చక్కటి ఫాంటసీని ఊహించుకున్నారు. చరిత్రను వర్తమానంతో ముడిపెడుతూ ఓ ఆసక్తికర కథ అల్లుకున్నారు. దాన్ని అంతే చక్కగా తెరపై ఆవిష్కరించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇప్పుడాయన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘బింబిసార2’ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) అంటూ ఓ వినూత్నమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో అలరించారు హీరో శర్వానంద్. ఈ చిత్రంతోనే దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్నీ దక్కించుకున్నారు శ్రీ కార్తీక్. వాస్తవానికి టైమ్ మిషన్ కథలు మనకు కొత్తేమీ కాకున్నా.. ఇందులో దాన్ని అమ్మ అనే ఎమోషన్తో జత చేసి ప్రేక్షకుల హృదయాల్ని కదిలించారు కార్తీక్. ఈ ఏడాది తెలుగులో సరోగసి (అద్దె గర్భం) నేపథ్యంలో రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో ఒకటైన ‘స్వాతిముత్యం’ సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె.కృష్ణ తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాతోనే బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకు పరిచయమయ్యారు. ఇక ఇటీవలే ‘మసూద’తో ప్రేక్షకుల్ని భయపెట్టారు దర్శకుడు సాయికిరణ్. చాలా తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు చక్కటి వసూళ్లు దక్కించుకుంది. ఈ కొత్త దర్శకులందరి నుంచి భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలొచ్చే అవకాశముంది. కొత్త ఏడాదిలో తెరపై అదృష్టం పరీక్షించుకోనున్న నవతరం దర్శకులకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయనడంలో సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల