ఆ 400 కుటుంబాల బాధ్య‌త నాదే: సోనూసూద్

లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికుల‌కు బాస‌ట‌గా నిలిచిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ర‌ణించిన, గాయాల‌పాలైన దాదాపు 400 కుటుంబాల‌ను ఆర్థికంగా ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు.

Published : 14 Jul 2020 01:46 IST

చ‌నిపోయిన‌ వ‌ల‌సకార్మిక కుటుంబాల‌కు ఆర్థికసాయం

దిల్లీ: లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికుల‌కు బాస‌ట‌గా నిలిచిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ తాజాగా మ‌రో నిర్ణ‌యం తీసుకున్నారు. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ర‌ణించిన, గాయాల‌పాలైన దాదాపు 400 వ‌ల‌సకార్మిక‌ కుటుంబాల‌ను ఆర్థికంగా ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు. 'మృతిచెందిన వ‌ల‌స కార్మికుల కుటుంబాల‌ భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకొని వారికి ఆర్థికస‌హాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. వారికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం నా వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌గా భావిస్తున్నాను' అని సోనూసూద్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌ర‌ణించిన‌ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన‌ వ‌ల‌స కార్మికులకు ఆర్థికస‌హాయం చేసే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల అధికారుల నుంచి మ‌ర‌ణించిన వ‌ల‌స కార్మికుల అడ్ర‌స్‌, బ్యాంకు అకౌంట్ల వివ‌రాల‌ను సేక‌రిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని