Director Krish: దర్శకుడిగా అలాంటి ప్రయాణాన్నే ఇష్టపడతా!
‘‘ప్రతి సినిమాకీ ఓ కొత్త అధ్యాయం ఉండాలనుకుంటా. చేస్తున్నది ఒకటే అనిపించకుండా..మరింత ఆసక్తికరంగా మరింత సాహసోపేతంగా అనిపిస్తే ఆ సినిమా ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఓ దర్శకుడిగా అలాంటి ప్రయాణాన్నే నేను ఇష్టపడతా’’ అంటున్నారు క్రిష్ జాగర్లమూడి. సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే దర్శకుల్లో ఈయన ఒకరు. ఆయన సినిమాల్లోని మాటలు, పాటలే ఆ విషయాన్ని
‘‘ప్రతి సినిమాకీ ఓ కొత్త అధ్యాయం ఉండాలనుకుంటా. చేస్తున్నది ఒకటే అనిపించకుండా..మరింత ఆసక్తికరంగా మరింత సాహసోపేతంగా అనిపిస్తే ఆ సినిమా ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఓ దర్శకుడిగా అలాంటి ప్రయాణాన్నే నేను ఇష్టపడతా’’ అంటున్నారు క్రిష్ జాగర్లమూడి. సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే దర్శకుల్లో ఈయన ఒకరు. ఆయన సినిమాల్లోని మాటలు, పాటలే ఆ విషయాన్ని చాటి చెబుతుంటాయి. తాజాగా ‘కొండపొలం’ నవల ఆధారంగా అదే పేరుతో ఓ సినిమాని తెరకెక్కించారు. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఆ చిత్రం ఈ నెల 8న రానుంది. ఈ సందర్భంగా క్రిష్ సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ఏ కథ చెప్పినా అంతర్లీనంగా మానవీయ విలువల గురించి చర్చించడం అలవాటు. నాకు ఎప్పట్నుంచో అడవులు, జంతువుల నేపథ్యంలో సినిమా చేయాలని ఉండేది. సాహసోపేతంగా సాగే అలాంటి సినిమాల్ని చూడటానికి స్వతహాగా నేను ఇష్టపడతాను. అందుకే వెంకటేష్తో ‘అతడు అడవిని జయించాడు’ నవలని ‘జంగిల్బుక్’ తరహాలో సినిమాగా తెరకెక్కించాలని అనుకున్నా. కానీ హక్కులు దొరక్క అప్పట్లో కుదరలేదు. ‘కొండపొలం’ తీయడానికే ఆ సినిమాని చేయలేదేమో మరి! దర్శకులం అంతా అప్పుడప్పుడూ సమావేశం అవుతుంటాం. ఎవరేం చదివారో చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో మేమంతా కలిసినప్పుడు సుకుమార్, మోహన్కృష్ణ ఇంద్రగంటి ఇద్దరూ ఒకేసారి ‘కొండపొలం’, ‘శప్తభూమి’ నవలల గురించి చెప్పారు. మొదట ‘శప్తభూమి’, ఆ తర్వాత ‘కొండపొలం’ చదివాను. ఆసక్తికరంగా అనిపించాయి. ‘శప్తభూమి’ ఓ మంచి వెబ్ సిరీస్ అవుతుంది. దాని హక్కుల గురించి కూడా ప్రయత్నించాం కానీ దొరకలేదు. ‘కొండపొలం’ హక్కులు తీసుకున్నాక సుక్కు ఫోన్ చేస్తే ‘నేనే హక్కులు తీసుకున్నా, ఇలా చేయబోతున్నా’ అని చెప్పా’’.
* ‘‘పుస్తకాన్ని సినిమాకి అనుగుణంగా మలచడం ఒకెత్తైతే, దాన్ని అడవి నేపథ్యంలో తీయాలనుకోవడం మరో ఎత్తు. రెండూ నాలో ఆత్రుతని పెంచిన విషయాలే. అహోబిలం వెళుతున్నప్పుడు కొండలపై గొర్రెలు కనిపించేవి. చూడ్డానికి చాలా బాగుండేది ఆ దృశ్యం. ఈ నవల చదువుతున్నప్పుడు ఆ దృశ్యాలన్నీ కళ్లముందు మెదిలాయి. కథని రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి చిక్కటి కథనంతో చాలా బాగా రాశారు. తెరలుతెరలుగా ఉత్కంఠని రేకెత్తిస్తుంటుంది కథ. సినిమాటిక్గా ఉన్న ఈ నవలని కాంతాసమేతంగా చెబితే బాగుంటుందనిపించింది. అలా పుట్టిందే ఓబులమ్మ పాత్ర. నా ‘గమ్యం’లో కూడా అంతర్లీనంగా ఓ ప్రేమకథ ఉంటుంది. అలా ఈ సినిమాకి ఓ అందమైన ప్రేమకథని జోడించాం. అలాగే సివిల్స్ విజేతల్ని దృష్టిలో పెట్టుకుని కథానాయకుడి పాత్రని తీర్చిదిద్దాం. రవీంద్రనాథ్ అనే ఓ కుర్రాడు తనలోని భయాల్ని జయించి బయటికి రావడానికి అడవి ఎలా దోహదం చేసిందనేది ఈ కథలో ఆసక్తికరం’’.
* ‘‘పవన్కల్యాణ్తో తీస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాకి పనిచేసిన బృందమే ఈ సినిమాకీ పనిచేసింది. కరోనాతో చిత్ర పరిశ్రమ అంతా స్తంభించి, లాక్డౌన్తో పనులు లేక అందరూ ఖాళీగా ఉన్న సమయంలోనే ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ విరామంలో ఓ సినిమా చేస్తే అందరికీ పని కల్పించినట్టు అవుతుందని అనుకున్నా. అదే విషయం పవన్కల్యాణ్కి చెబితే ఆయన నా ఆలోచనని అర్థం చేసుకుని ప్రోత్సహించారు. నిర్మాత ఎ.ఎం.రత్నం కూడా ఓకే చెప్పారు. అంతకుముందే నాకు సాయితేజ్ ‘ఉప్పెన’లోని నీ కళ్లు నీలి సముద్రం... పాట చూపించాడు. వైష్ణవ్ కళ్లు గురించి నేను, పవన్కల్యాణ్ కూడా మాట్లాడుకున్నాం. ఈ కథకి హీరో ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు తట్టింది వైష్ణవ్. తనకి నేర్చుకోవాలనే తపన చాలా ఉంటుంది. ఓబులమ్మ పాత్ర కోసం మరింత నాజూగ్గా మారింది రకుల్. సంగీత దర్శకుడిగా మొదట కాలభైరవని ఎంచుకోవాలనుకున్నా. కీరవాణితో ఈ కథ చదివించి మీరే చేయాలని చెప్పా. ఈ సినిమాలో మేమంతా ఒకొక్కరు ఒక్కో ‘కొండపొలం’ చేశాం’’.
‘‘మొదట ఈ చిత్రాన్ని గోవాలో తెరకెక్కించాలనుకున్నాం. అనుమతులు కూడా వచ్చాయి. కానీ కథ, పాత్రల గురించి చెప్పి ఇలా గొర్రెలు, గొర్రెలకాపరులతో చిత్రీకరణ చేస్తాం అన్నాక..గొర్రెల్ని చూసి పులులు వచ్చేస్తాయని అనుమతులు ఇవ్వలేదు. నల్లమలలో చిత్రీకరణ చేయాలనుకున్నా కుదరలేదు. దాంతో వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ చేశాం. పుస్తకం రాసిన సన్నపురెడ్డి సినిమాకి కూడా కథనం రాయడంతో నా పని మరింత సులభమైంది. అడవుల్లో ఏకధాటిగా 40 రోజులు చిత్రీకరణ చేయడం ఓ మంచి అనుభవం. మొదట ఒకట్రెండు రోజులు వింతగా అనిపించింది. వెయ్యి గొర్రెలతో కలిసి వెళ్లడం... అందరం కూడా సెట్ బాయ్స్ తరహాలో వస్తువుల్ని మోసుకుంటూ వెళ్లి చిత్రీకరణ చేశాం. ఈ సినిమా పూర్తయ్యేలోపు గొర్రెల్ని ఎలా కంట్రోల్ చేయొచ్చో మా సెట్లో అందరికీ తెలిసొచ్చింది’’.
‘‘సినిమా ప్రయాణంలో నాకు అత్యంత ఇష్టమైనది రచనే. సాహిత్యం నుంచి సినిమాకి చేసే ప్రయాణం ఎంతో ఆత్రుతగా ఉంటుంది. మా సంస్థ చాలా నవలలు కొన్నది. పెద్దింటి అశోక్కుమార్, వాసిరెడ్డి నవీన్, బుర్రా సాయిమాధవ్.... ఇలా ఎవరేం చేసినా, ఎవరేం చదివినా వాటిని నాకు పరిచయం చేస్తుంటారు. ప్రస్తుతం హాట్స్టార్ కోసం మల్లాది వెంకటకృష్ణ మూర్తి రాసిన ‘తొమ్మిది గంటలు’ నవల ఆధారంగా వెబ్సిరీస్ చేస్తున్నాం. ఇటు తెలంగాణ నుంచి అటు శ్రీకాకుళం వరకు విస్తృతస్థాయిలో రచయితలు ఉన్నారు. మన కథలు చాలానే తెరకెక్కుతున్నాయి.
‘‘హరి హర వీరమల్లు’ ఒక సన్నివేశం చేస్తే విరామం వరకు పూర్తవుతుంది. నవంబర్ రెండో వారం నుంచి తదుపరి చిత్రీకరణని ఆరంభిస్తాం’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!