Jai Bhim: ఆస్కార్ బరిలో ‘జైభీమ్’.. ‘మరక్కర్’
అతి పెద్ద సినీ సంబరం ఆస్కార్ పురస్కారాల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మార్చిలో జరగనున్న 94వ ఆస్కార్ వేడుకల కోసం.. బరిలో నిలిచే(షార్ట్లిస్ట్) 276 చిత్రాలను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్(విదేశీ) విభాగంలో సూర్య ‘జై భీమ్’, మోహన్లాల్ ‘మరక్కర్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.
షార్ట్లిస్ట్లో స్థానం
వరుసగా రెండో ఏడాది సూర్య చిత్రం
అతి పెద్ద సినీ సంబరం ఆస్కార్ పురస్కారాల వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మార్చిలో జరగనున్న 94వ ఆస్కార్ వేడుకల కోసం.. బరిలో నిలిచే(షార్ట్లిస్ట్) 276 చిత్రాలను ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. ఇందులో మన దేశం నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్(విదేశీ) విభాగంలో సూర్య ‘జై భీమ్’, మోహన్లాల్ ‘మరక్కర్’ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఈ మొత్తం సినిమాలకు సంబంధించిన జాబితాను ఆస్కార్ అకాడమీ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశమే హద్దురా’) గతేడాది ఆస్కార్ రేసులో పోటీపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన ‘జై భీమ్’ ద్వారా వరుసగా రెండో ఏడాది ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. తా.సే.జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రమిది. జస్టిస్ చంద్రు జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కోర్టు డ్రామా కథాంశంతో రూపొందించారు. ఇందులో సూర్య గిరిజన హక్కుల కోసం పోరాడే న్యాయవాదిగా చంద్రు పాత్రలో కనిపించి మెప్పించారు. గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకుంది.
* ఆస్కార్ షార్ట్లిస్ట్లో ‘జైభీమ్’తో పాటే నిలిచిన మరో భారతీయ సినిమా మోహన్లాల్ ‘మరక్కార్’. మలయాళ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మితమైన చిత్రమిది. కుంజలి మరక్కర్-ఖిజు జీవిత కథతో ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ సినిమా.. విడుదలకు ముందే మూడు జాతీయ అవార్డులు (ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైన్) గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. గతేడాది థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచి మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఫిబ్రవరి 8న తుది జాబితా
ప్రస్తుతం ఆస్కార్కు షార్ట్లిస్ట్లో నిలిచిన వాటిలో ‘స్పైడర్మ్యాన్ : నో వే హోమ్’, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘బీయింగ్ ద రికార్డస్’, ‘బెల్ఫాస్ట్’, ‘కోడా’, ‘డ్యూన్’, ‘ఎన్ కాంటో’, ‘హౌస్ ఆఫ్ గస్సీ’, ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’, ‘ఏ క్వైట్ ప్లేస్ పార్ట్2’, ‘స్పెన్సర్’ తదితర చిత్రాలున్నాయి. కాగా, తుది జాబితాకు ఎంపికైన సినిమాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. మార్చి 27న ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని దాదాపు 200 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.