Dhanush: 1930 నేపథ్యంలో...

ధనుష్‌ కథానాయకుడిగా అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకత్వంలో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ తెరకెక్కనుంది. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ పతాకంపై జి.శరవణన్‌, సాయిసిద్ధార్థ్‌ నిర్మిస్తున్నారు. టి.జి.త్యాగరాజన్‌ సమర్పకులు. శనివారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం

Updated : 03 Jul 2022 06:48 IST

ధనుష్‌(Dhanush) కథానాయకుడిగా అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకత్వంలో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) తెరకెక్కనుంది. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ పతాకంపై జి.శరవణన్‌, సాయిసిద్ధార్థ్‌ నిర్మిస్తున్నారు. టి.జి.త్యాగరాజన్‌ సమర్పకులు. శనివారం ఈ సినిమాని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.‘‘1930 - 40 నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ చిత్రమిది. ధనుష్‌ కెరీర్‌లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో రూపొందుతోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని