Ponniyin Selvan: మోత మోగిపోవాల్సిందే
విక్రమ్ పేరుకి తమిళ నటుడే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పేరు. ఇంకా చెప్పాలంటే ఆయన జాతీయస్థాయి నటుడు. సూర్య తమ్ముడిగా కెరీర్ మొదలుపెట్టినా స్టార్ హీరోగా ఎదిగారు కార్తి. ఈ ఇద్దరి సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.
విక్రమ్ పేరుకి తమిళ నటుడే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పేరు. ఇంకా చెప్పాలంటే ఆయన జాతీయస్థాయి నటుడు. సూర్య తమ్ముడిగా కెరీర్ మొదలుపెట్టినా స్టార్ హీరోగా ఎదిగారు కార్తి. ఈ ఇద్దరి సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. మాస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరికీ మోత మోగించడం కొత్తేమీ కాదు. కానీ అది ఇలా బాజా మోత కాదు..బాక్సాఫీసు మోత. ఎన్నో హిట్ సినిమాలతో బాక్సాఫీసుకు కాసులు కురిపించారు ఈ హీరోలు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రచార వేడుక కోసం అతిథులకు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో విక్రమ్, కార్తి సరదాగా బాజా మోగించి వేడుకలో జోష్ నింపారు. ఇంతకుమించిన జోష్ సినిమాలో ఉంటుందని బలంగా చెబుతున్నారు. ఈ నెల 30న సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది మోత ఏస్థాయిలో ఉంటుందో..!
‘ఖైదీ2’.. సెట్స్పైకి అప్పుడే
‘ఖైదీ’ చిత్రానికి సినీప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. కార్తి - లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ ముందు ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు చక్కటి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉండనున్నట్లు చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. అయితే ఇదింత వరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ సీక్వెల్పై కార్తి స్పష్టత ఇచ్చారు. ‘వచ్చే ఏడాది ‘ఖైదీ2’ మొదలు పెడతాం’ అని స్పష్టత ఇచ్చారు. లోకేష్ ప్రస్తుతం విజయ్తో ఓ సినిమా రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇది నవంబరులో సెట్స్పైకి వెళ్లనుంది. ఇది పూర్తయిన వెంటనే ‘ఖైదీ’ సీక్వెల్ పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రఫ్ డ్రాఫ్ట్ పూర్తయిందని సమాచారం. కార్తి ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. అలాగే త్వరలో ‘సర్దార్’గా బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం