Krishna Vamsi: రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి
‘‘70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్’ చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకి... మన సమాజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘రంగమార్తాండ’ (Ranga Marthanda) చేశాం.
- దర్శకుడు కృష్ణవంశీ
‘‘70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్’ చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకి... మన సమాజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘రంగమార్తాండ’ (rangamarthanda) చేశాం. కొన్ని సినిమాలకి అన్నీ కుదురుతాయి, కొన్నిసార్లు కుదరదు. ఈ సినిమాకి అనుకున్నవన్నీ పక్కాగా కుదిరాయి’’ అన్నారు కృష్ణవంశీ (Krishna Vamsi). ఆయన దర్శకత్వంలో ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలీపు మధు నిర్మాత. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మాస్ సినిమాల జోరు కొనసాగుతున్న సమయంలో ‘శంకరాభరణం’ వచ్చింది. ఈమధ్య ‘మహానటి’ వచ్చింది. అందరం అన్ని చిత్రాలూ బాగుండాలనే, ప్రేక్షకుల మెప్పు పొందాలనే తీస్తాం. ‘రంగమార్తాండ’ చూసినవాళ్లంతా బాగుందని చెప్పారు. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. విడుదల తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి అదే రకమైన స్పందన వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. మరాఠీలో ‘నటసామ్రాట్’ కథ ఎక్కువగా షేక్స్పియర్ నాటకాల చుట్టూ సాగుతుంది. మేం మన నాటకాలకి అన్వయిస్తూ స్క్రిప్ట్ని తీర్చిదిద్దాం. ప్రకాశ్రాజ్ ఆంగ్లం, సంస్కృతం, తెలుగు... ఏదైనా మాట్లాడతాడు. గొప్ప నటుడు తను. రాఘవరావు పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మానందం తన పాత్ర లుక్ కోసం ఏమీ తినకుండా, ఎన్ని టేక్లైనా ఓపికతో చేశారు. పెద్ద పెద్ద డైలాగ్స్ని ఆయన చెప్పారు. రమ్యకృష్ణ చేసిన పాత్ర కోసం మొదట వేరే నటుల్ని పరిశీలించాం. తను కూడా కొన్ని పేర్లు సూచించింది. ప్రతి సినిమాలోనూ పెద్ద పెద్దగా అరుస్తూ నటిస్తుంటావెందుకని నేను, మా అబ్బాయి రమ్యకృష్ణని అడుగుతుంటాం. కానీ ఇందులో కళ్లతోనే భావాలు పలికించే పాత్ర తనది. తన కళ్లు చాలా బాగుంటాయి. ఓరోజు ఈ పాత్రని నువ్వే ఎందుకు చేయకూడదని అడిగా. తను ఒప్పుకోవడంతోపాటు, ఆ పాత్రకి మేకప్, హెయిర్స్టైల్ తనే చేసుకుంది. తనపై క్లైమాక్స్లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నప్పుడు కంట్లో నీళ్లొచ్చాయి. వాటిని దాదాపు 36 గంటలపాటు తీశా’’ అన్నారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ‘‘కృష్ణవంశీ సర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అదే ప్రత్యేకం అనుకుంటే ఇందులో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం రావడం మరింత ఆనందాన్నిచ్చింది’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని