నిర్మాత ట్వీట్‌.. ‘నిశ్శబ్దం’ రూమర్స్‌కు చెక్‌..!

అగ్రకథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి హేమంత్‌ మధూకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై...

Updated : 18 May 2020 12:06 IST

ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడికి వచ్చాం..

హైదరాబాద్‌: అగ్రకథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి హేమంత్‌ మధూకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుష్కతోపాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే.. ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు మూతపడటంతో ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారంటూ గత కొన్నిరోజులుగా రూమర్లు‌ వినిపిస్తున్నాయి.

కాగా, తాజాగా చిత్రనిర్మాత కోన వెంకట్‌ పెట్టిన ట్వీట్‌తో ఈ సినిమా రిలీజ్‌పై వస్తోన్న రూమర్లకు చెక్‌ పడినట్లయ్యింది.‘సినిమా పట్ల మాకున్న అమితమైన ఆసక్తి, ప్రేమతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాం. మేము తీసిన సినిమా చూసి థియేటర్‌లో ప్రేక్షకులు ఇచ్చే రియాక్షనే మాకు ప్రేరణ, ఆక్సిజన్‌. ఆ ఫీలింగ్‌ను ఏదీ మ్యాచ్‌ చేయలేదు. సినిమా ఉన్నది సినిమా హాళ్ల కోసమే. అదే మా ప్రాధాన్యం కూడా....!!’ అని కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని