Hari Hara Veera Mallu: ఉగాది తర్వాత షురూ

వరుస సినిమాలతో మళ్లీ బిజీ కానున్నారు పవన్‌కల్యాణ్‌. ‘హరి హర   వీర మల్లు’ కొత్త షెడ్యూల్‌ కోసం రంగంలోకి దిగడంతోపాటు, కొత్తగా ఒప్పుకొన్న సినిమాల్ని పట్టాలెక్కించేందుకు ఆయన   సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా

Updated : 01 Apr 2022 14:32 IST

వరుస సినిమాలతో మళ్లీ బిజీ కానున్నారు పవన్‌కల్యాణ్‌. ‘హరి హర   వీర మల్లు’ కొత్త షెడ్యూల్‌ కోసం రంగంలోకి దిగడంతోపాటు, కొత్తగా ఒప్పుకొన్న సినిమాల్ని పట్టాలెక్కించేందుకు ఆయన   సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు’ ఇప్పటికే యాభై శాతానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని పూర్తి చేయడం కోసం, ఉగాది తర్వాత  కొత్త షెడ్యూల్‌ని  ఆరంభించనున్నారు. అందుకోసం కళాదర్శకుడు తోట తరణి నేతృత్వంలో పలు సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్‌ 6 నుంచి హైదరాబాద్‌లోనే చిత్రీకరణ షురూ కానున్నట్టు తెలిసింది. ఇది పూర్తయ్యేలోపే మరో కొత్త సినిమాని మొదలు పెట్టాలనే వ్యూహంతో ఆయన ఉన్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో ‘హరి హర వీర మల్లు’ తెరకెక్కుతోంది. ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ఎ.ఎం.రత్నం ఈ చిత్రానికి సమర్పకులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని