Janhvi Kapoor: జాన్వీ గూఢఛర్యం!

గ్లామర్‌ పాత్రల కంటే కూడా కొత్తదనం నిండిన కథలతో ప్రయాణం చేస్తోంది యువ కథానాయిక జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ఈ మధ్యే ఆమె నటించిన ‘మిలీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated : 20 Jan 2023 06:51 IST

గ్లామర్‌ పాత్రల కంటే కూడా కొత్తదనం నిండిన కథలతో ప్రయాణం చేస్తోంది యువ కథానాయిక జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ఈ మధ్యే ఆమె నటించిన ‘మిలీ’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విజయం సాధించలేదు కానీ జాన్వీ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. తాజాగా ఆమె ఓ స్పై థ్రిల్లర్‌ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. జంగ్లీ పిక్చర్స్‌ భారీ స్థాయిలో ‘ఉలఝ్‌’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ఓ స్పైగా నటిస్తోందట జాన్వీ. మూడు ప్రధాన పాత్రల చుట్టూ సాగే ఈ కథలో మరో కీలక పాత్రలో మలయాళ నటుడు రోషన్‌ మాథ్యూ నటిస్తున్నాడు. మూడో పాత్రలో ఓ సీనియర్‌ నటుడు నటించే అవకాశాలున్నాయి. సుధాన్షు సరియా ఈ చిత్రానికి దర్శకుడు. ‘రాజీ’ తర్వాత ఈ సంస్థ నుంచి వస్తోన్న మరో మహిళా ప్రాధాన్య చిత్రమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని