No Time To Die: జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ ప్రత్యేకతలివే!
James Bond: బాండ్ కొత్త సినిమా ‘నో టైమ్ టు డై’ గురించి తెలుసా?
జేమ్స్ బాండ్ కొత్త చిత్రం 'నో టైమ్ టు డై' విడుదలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద సందడి మొదలైంది. బాండ్గా డేనియల్ క్రెగ్ కి ఇది చివరి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. హాలీవుడ్ సినిమాల అభిమానులకి యాక్షన్ విందును అందించేందుకు బాండ్ సిద్ధమైయ్యాడు. ఈ సందర్భంగా 'నో టైమ్ టు డై' ప్రత్యేకతలేంటో ఓ సారి చూద్దాం.
* జేమ్స్ బాండ్ సిరీస్లో వస్తున్న 25వ సినిమా ‘నో టైమ్ టు డై’. బాండ్గా డేనియల్ క్రెగ్కి ఇది చివరి చిత్రం. ఇప్పటివరకు క్రెగ్ ఐదు సార్లు జేమ్స్ బాండ్గా అదరగొట్టాడు. ‘కాసినో రాయల్’తో నయా బాండ్గా అవతరించిన క్రెగ్... ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’, ‘క్వాంటమ్ సోలస్’తో మూడు బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిపెట్టాడు.
* దాదాపు 300 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో ‘నో టైమ్ టు డై’ నిర్మించారు. జేమ్స్ బాండ్ సినిమాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక బడ్జెట్.
* మొదటిసారి ఈ సినిమా కోసం ఒక అమెరికన్ డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ‘బీస్ట్స్ ఆఫ్ నో నేషన్’తో హాలీవుడ్ను ఆకర్షించిన కారీ ఫుకునాగా ‘నో టైమ్ టు డై’కి దర్శకుడు.
* వాస్తవానికి ‘స్లమ్డాగ్ మిలియనీర్’ దర్శకుడు డాని బోయెల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సింది. అనివార్య కారణాల వల్ల ఆయన మధ్యలోనే విరమించుకున్నారు.
* సినిమా చిత్రీకరణ అనేక ఇబ్బందులతో సాగింది. డేనియల్ క్రెగ్ గాయపడటం వల్ల షూటింగ్ కొన్నాళ్లు ఆగింది. షూటింగ్ బృందంలో కొందరు కరోనా బారిన పడటంతో మరికొన్నాళ్లు ఆగిపోయింది. ఇలా అనేక కష్టాలు పడి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
(రమీ మాలెక్, క్రిస్టోఫ్ వాల్ట్స్)
* ఇద్దరు ఆస్కార్ నటులు ఈ సినిమాలో విలన్లుగా నటించారు. ‘బొహిమినియన్ రాప్సోడి’తో ఆస్కార్ను ముద్దాడిన రమీ మాలెక్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. రెండు ఆస్కార్లు గెలిచిన క్రిస్టోఫ్ వాల్ట్స్ ‘నో టైమ్ టు డై’లోనూ నటించారు. ఆయన గతంలో స్పెక్టర్’లోనూ నటించారు.
(హన్స్ జిమ్మర్)
* ‘లయన్ కింగ్’, ‘గ్లాడియేటర్’, ‘ది డార్క్ నైట్’, ‘ఇన్సెప్షన్’ లాంటి సినిమాలకు నేపథ్య సంగీతమందించిన దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ ‘నో టైమ్ టు డై’కి పని చేశారు. ఆయన బాండ్ సినిమాలకు పనిచేయడం ఇదే తొలిసారి.
(సినిమాటోగ్రాఫర్ లైనస్ సాండ్గ్రెన్)
* హాలీవుడ్ ప్రేమకథా చిత్రం ‘లాలా ల్యాండ్’తో ఆస్కార్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ లైనస్ సాండ్గ్రెన్. ‘నో టైమ్ టు డై’ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. జేమ్స్ బాండ్ను ఆయన మరింత స్టైలిష్గా చూపించారనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.
(బిల్లీ ఐలిష్)
* జేమ్స్ బాండ్ సినిమాపైనే కాదు, ఆ సినిమా టైటిల్ సాంగ్పైనా అదే స్థాయి అంచనాలుంటాయి. వాటికి ఎక్కడా తగ్గకుండా ‘నో టైమ్ టు డై’ ఒరిజినల్ సాంగ్ అదరగొట్టింది. 18 ఏళ్ల యువ సంచలనం బిల్లీ ఐలిష్ ఈ పాట పాడటం విశేషం. ఇంత చిన్న వయసులోనే బాండ్కి పాట పాడిన గాయకురాలిగా బిల్లీ రికార్డు సృష్టించింది. ‘స్పెక్టర్’కు సామ్ స్మిత్ పాడిన ‘రైటింగ్ ఆన్ ది వాల్’ పాటకీ మంచి ఆదరణ లభించింది.
( ఫిబీ వాలర్ బ్రిడ్జ్)
* బాండ్ సినిమాలకు ఇదివరకు ఒకే ఒక్క మహిళా రచయిత పనిచేశారు. బాండ్ సిరీస్లో మొదటి రెండు చిత్రాలైన ‘డాక్టర్ నో’, ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’ సినిమాలకు జొహన్నా హర్వుడ్ అనే రచయిత్రి పని చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మరో రచయిత్రి బాండ్ పాత్రను తీర్చిదిద్దారు. ఫిబీ వాలర్ బ్రిడ్జ్ ‘నో టైమ్ టు డై’ స్ర్కిప్ట్ పనుల్లో పాలుపంచుకున్నారు. డేనియల్ క్రెగ్ పట్టుపట్టి మరీ ఆవిడను ఈ సినిమా పనుల్లో భాగం చేశారు. ఆమె రచనలో బాండ్ మరింత పదునుగా కనిపించనున్నాడనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఆమె కేవలం రచయిత్రి మాత్రమే కాదు, మంచి నటిగా కూడా.
* లండన్, జమైకా, ఇటలీలో భారీ ఎత్తున షూటింగ్ జరిగింది. ఆ సన్నివేశాలు యాక్షన్ ప్రియులను అలరిస్తాయని తెలుస్తోంది.
* గతేడాది వేసవి సెలవులకు రావాల్సిన సినిమా కరోనా కారణంగా అక్టోబరుకి వాయిదా పడింది. కొవిడ్ ఉద్ధృతి పెరిగే కొద్ది సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. సినిమా విడుదల తేదీని ఈ ఏడాది ఏప్రిల్కి మార్చారు. సెకండ్ వేవ్ వదలకపోవడంతో మళ్లీ వాయిదా పడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని అవాంతరాలను దాటుకొని ఎట్టకేలకు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు బాండ్. ఏ మేరకు అలరిస్తాడో తెలియాలంటే థియేటర్లకు వెళ్లి తెలుసుకోవాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!