MAA Election: ‘మా’ అధ్యక్షుడు ఏకగ్రీవమైతే తప్పేంటి?: నరేశ్
Maa election: రాబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు తెలుపుతానో ఇంకా నిర్ణయించుకోలేదని, ప్రస్తుతం అధ్యక్షుడి స్థానంలో
ఇంటర్నెట్డెస్క్: రాబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు తెలుపుతానో ఇంకా నిర్ణయించుకోలేదని, ప్రస్తుతం అధ్యక్ష స్థానంలో ఉండటంతో దానిపై స్పందించటం సరికాదని సీనియర్ నటుడు, ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ అన్నారు. తాజాగా ఓ టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ‘మా మసకబారింది’ అంటూ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయని అన్నారు.
‘‘ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు? ఎవరికి సపోర్ట్ చేస్తారనేది పనితనం, పాలిటిక్స్, వ్యక్తిగత కారణాల బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ భావాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు. ‘చెడు ఉంటే చెవిలో చెబుదాం. మంచి ఉంటే మైక్లో మాట్లాడదాం’ అని చిరంజీవిగారు అన్నారు. ‘మా’ గురించి చెడుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవచ్చని నియమ నిబంధనల్లో ఉంది. ‘మా’పై వ్యాఖ్యలు చేసే వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఒకప్పుడు నాగబాబుగారు రాజేంద్రప్రసాద్, శివాజీరాజాలకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మా ప్యానెల్కు మద్దతు తెలిపారు. కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసే నడిచాం. నేను అధ్యక్షుడిని అయిన తర్వాత ‘మా’ వెల్ఫేర్ కోసం కష్టపడి పనిచేశా. సభ్యుల కోసం ఆరోగ్య బీమా కల్పించాం. ‘మా’ సభ్యత్వం ఉన్న 16 మంది చనిపోతే వారికి రావాల్సిన బీమా రూ.3లక్షలు 24 గంటల్లో అందించాం. లాక్డౌన్ సమయంలో సాయం అందించడానికి రూ.14లక్షలు ‘మా’ ఖాతాలో జమ చేశాం. చిరంజీవిగారు కూడా మెచ్చుకున్నారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు తగులుతాయి’’ అని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా తాను మంచి మెజార్టీతో గెలుస్తానని నరేశ్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తాను పోటీ చేయనని, యువరక్తం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఏకగ్రీవం చేస్తే, గొంతు నులిమేసినట్లేనని నాగబాబు అన్న మాటలతో ఏకీభవించనని ఈ సందర్భంగా నరేశ్ చెప్పుకొచ్చారు. భాజపాలాంటి జాతీయ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడే ఏకగ్రీవం చేస్తారని, అలాంటప్పుడు ‘మా’ అధ్యక్షుడు ఏకగ్రీవమైతే తప్పేంటని అన్నారు. ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే, భవనం కట్టించేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని మంచు విష్ణు చెప్పడం అభినందనీయమన్న నరేశ్, అందుకు తనవంతు సాయం కూడా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రకాశ్రాజ్కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని కేవలం నాగబాబు మాత్రమే చెప్పారని, పెద్దాయన చిరంజీవి దీనిపై ఇంకా స్పందించలేదు కదా! అన్నారు. చిత్ర పరిశ్రమలో కులాల పేరుతో రాజకీయాలు జరిగే ఆస్కారమే లేదని, అందరిదీ సినిమా కులమేనని నరేశ్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఇంటర్నెట్డెస్క్: 2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య