Sarkaru Vaari Paata: ఏపీలో ‘సర్కారువారి పాట’ టికెట్‌ ధర పెంపు.. ఎంతంటే?

మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, కామెడీ చిత్రం ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata).

Published : 07 May 2022 15:38 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, కామెడీ చిత్రం ‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata). కీర్తి సురేశ్‌(keerthy suresh) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సూపర్‌ హైబడ్జెట్‌ కేటగిరీ కింద టికెట్‌పై రూ.45 పెంచనున్నారు. 10 రోజుల పాటు పెంచిన ధరలు అమలులో ఉంటాయి.

భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘సర్కారువారి పాట’ చిత్ర టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, అమెరికాలోనూ ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. 223 లొకేషన్లలో 648 షోలను ప్రదర్శించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి, తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని