Pushpa: ‘పుష్ప 2’లో హైలెట్ అదే.. అంచనాలు పెంచేలా దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఆ అంచనాలు రెట్టింపయ్యే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా స్క్రీన్ప్లే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని తెలిపారు. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్ (Allu Arjun) గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలెట్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అర్జున్ పెర్ఫామెన్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఈ సినిమా నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుందని, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందని తెలిపారు. జాతర ఎపిసోడ్కు సంబంధించిన ఫస్ట్లుక్ (అల్లు అర్జున్ లుక్) ఇప్పటికే విడులైన సంగతి తెలిసిందే.
‘గుంటూరు కారం’ పాటల విడుదలపై ప్రశ్న.. నిర్మాత సమాధానమేంటంటే?
2021 డిసెంబరులో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘పుష్ప’కు సీక్వెల్గా ‘పుష్ప 2’కు తెరకెక్కుతోంది. రష్మిక (Rashmika) కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ‘పుష్ప’ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్కు జాతీయ అవార్డురావడం, దేవిశ్రీ ప్రసాద్కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కడంతో ‘పుష్ప 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప 2’ విషయంలో ఆ బాధలేదు: అజయ్ ఘోష్
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు అజయ్ ఘోష్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘పుష్ప’ సినిమాపైనా స్పందించారు. -
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
తాను ప్రకటించిన ‘అన్నం’ సినిమాపై ప్రశ్న ఎదురవగా డైరెక్టర్ కృష్ణవంశీ స్పందించారు. -
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘భారతీయుడు 2’లోని కమల్ నటించిన ప్రతి సన్నివేశం పవర్ఫుల్గా ఉంటుందన్నారు దర్శకుడు శంకర్. ఆ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. -
సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చారు: విష్వక్ సేన్
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ శుక్రవారం విడుదలైంది. కొందరు చూడకుండానే రివ్యూలు ఇచ్చారని హీరో అన్నారు. -
రణ్వీర్ - ప్రశాంత్ వర్మల ప్రాజెక్ట్ వాయిదా.. అధికారిక వెల్లడి
ప్రశాంత్ వర్మ - రణ్వీర్ సింగ్ల కాంబోలో రానున్న ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పట్లో ఇది లేదని స్పష్టమైంది. -
అందుకే ‘కల్కి’ బడ్జెట్ ఎక్కువ: ప్రభాస్
‘కల్కి’ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించినట్లు ప్రభాస్ చెప్పారు. దానికి గల కారణాన్ని చెప్పారు. -
రామ్ చరణ్తో మల్టీస్టారర్.. శర్వానంద్ ఏమన్నారంటే?
‘భజే వాయు వేగం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్ చరణ్తో మల్టీస్టారర్పై స్పందించారు. -
తరాలు మారితే టెక్నాలజీ మారుతుంది.. బాలయ్య ఎనర్జీ కాదు: హైపర్ ఆది
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది.. బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. -
తండేల్.. నా కెరీర్లోనే అత్యంత భారీ చిత్రం: నాగచైతన్య
నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘తండేల్’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కొత్త సినిమా ప్రకటించిన గుణశేఖర్.. ఆసక్తికరంగా టైటిల్..
దర్శకుడు గుణశేఖర్ కొత్త సినిమాను ప్రకటించారు. దాని టైటిల్ ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
‘కేజీయఫ్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్
‘పుష్ప 3’ గురించి ప్రస్తుతం టాలీవుడ్లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఆ మూవీ ఎప్పుడు ఉంటుందో తెలుసా? -
ముందు ‘భజే వాయు వేగం’.. తర్వాత ‘స్పై’: ఐశ్వర్య మేనన్
‘భజే వాయు వేగం’ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు నటి ఐశ్వర్య మేనన్. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న పలు విశేషాలివీ.. -
ఆ సినిమాలేవీ నన్ను భయపెట్టలేదు: విష్వక్ సేన్
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు విష్వక్ సేన్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పలు విశేషాలు పంచుకున్నారు. -
జాన్వీ స్థానంలో త్రిప్తి డిమ్రి .. హిట్ మూవీ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్
జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం ‘ధడక్’కు సీక్వెల్ను ప్రకటించారు. ఇందులో తారాగణాన్ని మార్చుతున్నట్లు తెలిపారు. -
‘ది గోట్’.. ఫ్యాన్స్ ఖుష్ అయ్యే అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ది గోట్’ అప్డేట్ను మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా షేర్ చేశారు. దీంతో అభిమానులు ఆనందిస్తున్నారు. -
రణ్వీర్ లుక్టెస్ట్ పూర్తయింది: రూమర్స్పై స్పందించిన ప్రశాంత్ వర్మ
రణ్వీర్ సింగ్తో చేయనున్న ప్రాజెక్ట్పై వస్తోన్న రూమర్స్ గురించి ప్రశాంత్ వర్మ స్పందించారు. లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలిపారు. -
మే చివరి వారం.. థియేటర్లో అలరించే చిత్రాలివే.. మరి ఓటీటీలో..?
upcoming movies this week: గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మే చివరి వారంలో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఓటీటీలో సినిమాలు, వెబ్సిరీసులు అలరించేందుకు సిద్ధమయ్యాయి. -
రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’.. తన పాత్ర గురించి చెప్పిన అంజలి
తన కొత్త సినిమా (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్)ల గురించి నటి అంజలి పలు విశేషాలు పంచుకున్నారు. -
ఆ రూమర్స్పై స్పందించిన ‘సలార్ 2’ నిర్మాణ సంస్థ.. ఏమందంటే?
‘సలార్ 2’ విషయంలో వచ్చిన రూమర్స్పై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. -
150 రోజుల ట్రైనింగ్.. 30 రోజుల షూటింగ్.. రెండుసార్లు గాయాలు
జాన్వీకపూర్ తాను నటిస్తున్న ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మహి’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. -
ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఫొటో షూట్.. ప్రోమో రెడీ అయింది
Ranveer Singh: రణ్వీర్ సింగ్తో ప్రశాంత్వర్మ చేయనున్న సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది
తాజా వార్తలు (Latest News)
-
93 ఏళ్ల వయస్సులో.. మీడియా దిగ్గజం మర్దోక్కు ఐదో పెళ్లి
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు