Nayanthara: నయనతారపై కేసు నమోదు

అగ్ర నాయిక, బహుభాషా నటి నయనతారపై కేసు నమోదైంది. ఆమె నటించిన ‘అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ ఈమధ్యే విడుదలైన సంగతి తెలిసిందే.

Updated : 09 Jan 2024 09:15 IST

గ్ర నాయిక, బహుభాషా నటి నయనతారపై కేసు నమోదైంది. ఆమె నటించిన ‘అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ ఈమధ్యే విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులోని కొన్ని సన్నివేశాలు మా మత భావాలను కించపరిచేలా, ‘లవ్‌ జిహాద్‌’ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ముంబయికి చెందిన ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నయనతార, జై, నీలేశ్‌లతోపాటు నిర్మాతలు జతిన్‌ సేథీ, ఆర్‌ రవీంద్రన్‌, పునీత్‌ గోయెంకాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ చిత్రానికి నీలేశ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని