MAA Elections: వాళ్లు రాజీనామా.. మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?
భవిష్యత్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడానికి తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11మంది
హైదరాబాద్: భవిష్యత్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా సాగడానికి తమ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్రాజ్ ప్రకటించారు. చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో ‘మా’ ఎన్నికలు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్ వ్యవహారశైలి కారణంగా తాము అసోసియేషన్లో కొనసాగలేమని ప్యానెల్ సభ్యులు తెలిపారు. ఇక పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మోహన్బాబు వ్యవహరించిన తీరునూ ప్రకాశ్రాజ్ ప్యానెల్ తీవ్రంగా ఖండించింది. మోహన్బాబు వాడిన భాష సరిగా లేదని, బెనర్జీ కన్నీటి పర్యంతమవగా, తనీశ్ భావోద్వేగానికి గురయ్యారు. భయపడుతూ ‘మా’లో కొనసాగలేమని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన వారు రాజీనామా చేయడంతో తర్వాత ఏం జరుగుతుంది? అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు?
విష్ణు ఏం చేయబోతున్నారు!
‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే మంచు విష్ణు ముందు అనేక సవాళ్లు వచ్చి పడ్డాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నేరవేర్చడం సంగతి పక్కన పెడితే, ప్రకాశ్రాజ్ ప్యానెల్ నుంచి గెలిచి రాజీనామా చేసిన వారి స్థానాలను భర్తీ చేయడం ముందున్న సవాల్. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి... 11మంది రాజీనామాలను ఆమోదించటం, రెండు.. వారి స్థానంలో కొత్త వారిని నియమించటం. ఒకరో ఇద్దరో రాజీనామా చేస్తే బుజ్జగించే బాధ్యతను తీసుకోవచ్చు. వాళ్లను ప్రత్యేకంగా చూడవచ్చు. కానీ, ఇక్కడ మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో మంచు విష్ణుకు ఆ ఆప్షన్ లేకుండా పోయింది. ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రకాశ్రాజ్ ప్యానెల్ వెనకడుగు వేయదన్నది సినీ వర్గాల మాట. అలాంటి పరిస్థితుల్లో కొత్త వారిని నియమించటమే విష్ణు ముందున్న ఏకైక మార్గం.
కొత్త వారిని నియమించటం సాధ్యమేనా?
‘మా’ అసోసియేషన్లో ఒక పదవిలో కొనసాగుతున్న వ్యక్తి స్థానం ఖాళీ అయితే, దాన్ని భర్తీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. ‘మా’ బై లా రూల్ పొజిషన్ 17 ప్రకారం ‘మా’లో ఎవరైనా సభ్యుడి పోస్ట్కు ఖాళీ ఏర్పడితే, అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని దాన్ని భర్తీ చేస్తారు. ఆ పదవికి మరొక వ్యక్తిని నామినేట్ చేస్తారు. అయితే, ఆ నియామకం తర్వాత జరిగే జనరల్ బాడీ మీటింగ్లో సభ్యుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. అదే విధంగా ఏడాదికొకసారి జరిగే సర్వసభ్య సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్ స్థానంలో విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాబూమోహన్ను నామినేట్ చేయవచ్చు. ఇలా ప్రతి పోస్టు ఒక వ్యక్తిని నామినేట్ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది.
ప్రకాశ్రాజ్ ప్యానెల్ రాజీనామా నిర్ణయం సరైనదేనా?
సాధారణ ఎన్నికలతో పోలిస్తే, ‘మా’ అసోసియేషన్కు జరిగే ఎన్నికలు కాస్త భిన్నమైనవి. అభ్యర్థులు వేర్వేరు ప్యానెల్స్ నుంచి పోటీ చేసినా, గెలిచిన వారందరూ కలిసి ఒకే ప్యానెల్గా ఏర్పడతారు. గతంలో అన్నీ ఏకగ్రీవాలు కావడంతో సభ్యుల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. శివాజీరాజా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత నరేశ్ అధ్యక్షుడైన తర్వాత కూడా అభిప్రాయ భేదాలతో రచ్చకెక్కారు. వివాదాలతో ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. డైరీ విడుదల వేడుక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భవిష్యత్లో ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని ప్రకాశ్రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన సభ్యులు ఆరోపిస్తున్నారు. తమను పని చేయనీయకుండా చేశారని నరేశ్ ఏవిధంగా చెబుతున్నారో మంచు విష్ణు కూడా అలాగే చెప్పే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. మరి ఓట్లు వేసి గెలిపించిన వారికి ఏం సమాధానం చెబుతారు? ‘మా’ సభ్యుల సంక్షేమాన్ని పక్కన పెట్టి గొడవలు పడటం కన్నా, బయటకు రావటమే మంచి నిర్ణయమని కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచి, అధికారం కోసం మరో పార్టీలో చేరే వారితో పోలిస్తే, ఇలా రాజీనామా చేయడం ఉత్తమమని అంటున్నారు. వాదోపవాదాలకు తావు లేకుండా అధ్యక్షుడు వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, అది ‘మా’ సభ్యులకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. అయితే, ఏదో చేస్తారని నమ్మి ఓటేసి గెలిపించిన వారి ఆశలను అడియాసలు చేస్తూ రాజీనామా చేయటం కూడా సరైన నిర్ణయం కాదని మరికొందరు భావిస్తున్నారు. బయటకు రావటం కన్నా అసోసియేషన్లోనే ఉండి, అధ్యక్షుడిగా మంచు విష్ణు తీసుకునే ఏక పక్ష నిర్ణయాలను ప్రశ్నించి ఉంటే ‘మా’ కార్యకలాపాల్లో పారదర్శకత ఉండేదని అంటున్నారు. అసలు ‘మా’ ఎన్నికల్లో పోటీ లేకుండా పదవులన్నీ ఏకగ్రీవమైతే ఇన్ని గొడవలు, వివాదాలు జరిగి ఉండేవి కాదని చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ దిశగా సినీ పెద్దలు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి చేయిదాటిపోయిందని, చివరకు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు స్థాయికి చేరిందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!