పూరి మాట: వాళ్లే అసలైన మిస్ ఇండియాలు
సినిమాల్లో మాటల తూటాలతో అలరిస్తున్న పూరి జగన్నాథ్... ఇటీవల మ్యూజింగ్స్ పేరుతో ఓ పాడ్కాస్ట్ను లాంచ్ చేశారు. తన జీవితంలోని విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న, గతంలో జరిగిన అంశాల గురించి తన అభిప్రాయాలను
ఇంటర్నెట్ డెస్క్: సినిమాల్లో మాటల తూటాలతో అలరిస్తున్న పూరి జగన్నాథ్... ఇటీవల మ్యూజింగ్స్ పేరుతో ఓ పాడ్కాస్ట్ను లాంచ్ చేశారు. తన జీవితంలోని విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న, గతంలో జరిగిన అంశాలపై తన అభిప్రాయాలను వివరిస్తున్నారు. ఆయన సినిమాల్లో డైలాగ్ తలపిస్తూ పాడ్కాస్ట్లో మాటలు కాస్త గట్టిగానే తాకుతున్నాయి. అందులో తాజాగా ‘స్త్రీ’ పేరుతో ఓ మ్యూజింగ్ను విడుదల చేశారు. అందులో పూరి ఏమన్నారంటే...
స్త్రీని మనం ఎప్పుడూ పుస్తకాల్లోనే గౌరవించాం. నిజ జీవితంలో కాదు. మాతృస్వామ్య వ్యవస్థ పోయి, ఎప్పుడైతే సమాజం మగాళ్ల చేతికొచ్చిందో అప్పటినుంచి ఆడాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. అవసరం కోసమే ఆడది అనేలా తయారైంది. ఇంట్లో పనుల కోసం, వంట కోసం అన్నట్లు చూడటం మొదలైంది. కొన్నేళ్ల క్రితం పేదరికం, ఆత్మన్యూనత భావం వల్ల తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లి చేసేసేవారు. ఎంతో కొంత కన్యాశుల్కం వస్తుంది కదా అనుకునేవారు. దీని తర్వాత వరకట్నం వచ్చింది. అది ఇప్పటికీ పోవడం లేదు. దాని తర్వాత ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని దారుణం సతీసహగమనం. భర్త చనిపోతే అదే చితి మీద బతికున్న భార్యను తగలబెట్టడం. ఒకరోజు కాదు, వంద రోజులు కాదు... కొన్ని వందల ఏళ్లు ఆడవాళ్లను తగలబెట్టాం. సజీవదహనం చేశాం. ఆఖరి సజీవ దహనం ఎప్పుడు జరిగిందో తెలుసా? నిన్నగాక మొన్న 1987లో మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల అమ్మాయిని, 2002లో 65 ఏళ్ల మహిళను సజీవ దహనం చేశారు. ఆ తర్వాత ఆడవాళ్లను విధవను చేశాం. వితంతువును ఎన్ని కష్టాలు పెట్టామో మనందరికీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మన అమ్మమ్మ, నాన్నమ్మను చూస్తూ పెరిగాం. తెల్ల చీర కట్టుకోవాలి, కుంకుమ తాకకూడదు. శుభకార్యం అయితే ఆ చుట్టుపక్కలకు రానివ్వరు. ఆవిడ ఎదురొస్తే అశుభమట. అలా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు దాక్కోలేక నానా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజుల్లో ఆచారం ముసుగులో మూర్ఖుల్లా వ్యవహరించారు. అందుకే మన గురించి గొప్పలు చెప్పుకోకండి. ఎందరో తల్లుల్ని తగలబెట్టిన దేశం మనది. ఈ ఒక్క దేశంలో ఆడవాళ్లు ధైర్యంగా తిరుగుతున్నారు.. మాట్లాడుతున్నారు. ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుంటున్నారు. కానీ 60 వేల సంవత్సరాలు ఆడవాళ్లకు నరకం చూపించాం. ఇప్పటికీ ప్రతి గంటకు ఒక రేప్ జరుగుతూనే ఉంది. ఏ దేశంలో స్త్రీకి గౌరవం లభిస్తుందో, ఆ దేశాలే అందరినీ రూల్ చేస్తాయి. స్త్రీకి నరకం చూపించిన దేశాలన్నీ ఇబ్బందులు పడ్డాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఇక నుంచైనా మగాడి మీద ఆధారపడకుండా ఆడాళ్లు ఎదగాలి. అందగత్తెలకు కాదు ర్యాంప్ వాక్లు.. మగాళ్ల తోడు లేకుండా తన కాళ్ల మీద నిలబడ్డ ఆడవాళ్లకు పెట్టాలి ర్యాంప్ వాక్లు. విజయవంతమైన, దృఢమైన, స్వతంత్ర భావాలతో తనను తాను నిరూపించుకున్న మహిళలను గౌరవించాలి.. సన్మానాలు చేయాలి. వాళ్లే మన మిస్ ఇండియాలు
- పూరీ జగన్నాథ్ @ పాడ్కాస్ట్
ఈ మ్యూజింగ్ ఆయన మాటల్లో వినాలంటే...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!