Raashi Khanna: ‘ది సబర్మతీ రిపోర్ట్’ ముగిసింది
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. 2002 ఫిబ్రవరి 27న జరిగిన ఈ దుర్ఘటనలో 59మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉంది ఈ చిత్రబృందం.
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. 2002 ఫిబ్రవరి 27న జరిగిన ఈ దుర్ఘటనలో 59మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉంది ఈ చిత్రబృందం. ‘ట్వెల్త్ ఫెయిల్’తో విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే ఇందులో జర్నలిస్ట్ సమర్ కుమార్ పాత్రలో కనిపించనున్నారు. రాశీ ఖన్నా కీలక పాత్రలో మెరవనుంది. రంజన్ చందేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తైనట్లు రాశి తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ‘‘ది సబర్మతీ రిపోర్ట్’ షూటింగ్ ముగిసింది. దీని కోసం ఎన్నో నిజాలను వెంటాడాము. ఈ చిత్రంతో ప్రాణాలు కోల్పోయిన వారి గొంతుక వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ కథను వెండితెరపై చూసేందుకు సిద్ధంగా ఉండండి. అంకితభావం ఉన్న అద్భుతమైన బృందంతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యల్ని జోడించింది రాశి. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 3న విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాగార్జునతో బాబీ దేవోల్ ఢీ!
‘కుబేర’ తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన స్టూడియో గ్రీన్ పతాకంపై తమిళ దర్శకుడు నవీన్తో ఓ సినిమా చేయనున్నారు. -
మళ్లీ కలిసేనా?
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. -
మరోసారి ఈ జోడీ?
నాగచైతన్య - పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘తండేల్’ సినిమా చేస్తున్న చైతూ... తదుపరి కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
పేరు మరింత బాధ్యతని పెంచింది
పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం. -
భయపెడుతూనే నవ్విస్తుంది... బాక్
‘అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. -
విదేశాల్లో వచ్చినా... మన దేశంలో రాలేదు
‘‘సుహాస్ అనగానే వినూత్నమైన కథలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని ఓ కొత్త కథని ‘ప్రసన్న వదనం’తో చెబుతున్నాం. -
నేను గ్యాంగ్స్టర్గా నటిస్తే...!
తన ఫొటోషూట్స్తో సామాజిక మాధ్యమాల్నీ సందడి చేస్తుంటుంది మాళవిక మోహనన్. చీర కట్టినా... చిట్టి పొట్టి ట్రెండీ దుస్తులేసినా గ్లామరస్గా కనిపించడంలో ఆమెదంటూ ఓ ప్రత్యేకమైన శైలి. -
యాక్షన్ గణేశుడు వస్తున్నాడు
గతేడాది ‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!