Raashi Khanna: ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ ముగిసింది

గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. 2002 ఫిబ్రవరి 27న జరిగిన ఈ దుర్ఘటనలో 59మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉంది ఈ చిత్రబృందం.

Updated : 24 Mar 2024 11:25 IST

గోద్రా రైలు దహనకాండ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. 2002 ఫిబ్రవరి 27న జరిగిన ఈ దుర్ఘటనలో 59మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పించేందుకు సిద్ధంగా ఉంది ఈ చిత్రబృందం. ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’తో విజయాన్ని అందుకున్న బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే ఇందులో జర్నలిస్ట్‌ సమర్‌ కుమార్‌ పాత్రలో కనిపించనున్నారు. రాశీ ఖన్నా కీలక పాత్రలో మెరవనుంది. రంజన్‌ చందేల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తైనట్లు రాశి తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ‘‘ది సబర్మతీ రిపోర్ట్‌’ షూటింగ్‌ ముగిసింది. దీని కోసం ఎన్నో నిజాలను వెంటాడాము. ఈ చిత్రంతో ప్రాణాలు కోల్పోయిన వారి గొంతుక వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ కథను వెండితెరపై చూసేందుకు సిద్ధంగా ఉండండి. అంకితభావం ఉన్న అద్భుతమైన బృందంతో కలిసి పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యల్ని జోడించింది రాశి. ఏక్తా కపూర్‌, శోభా కపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 3న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని