Ram Charan: కొరటాల శివ వల్ల ‘RRR’.. రాజమౌళి వల్ల ‘Acharya’: రామ్చరణ్
చిరంజీవి- రామ్చరణ్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ‘ఆచార్య’ చూపించబోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చరణ్ విలేకరులతో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: చిరంజీవి- రామ్చరణ్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ‘ఆచార్య’(Acharya) చూపించబోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చరణ్ విలేకరులతో ఆదివారం మాట్లాడారు. కొరటాల శివ వల్ల ‘RRR’లో అడుగుపెట్టానని, రాజమౌళి వల్ల ‘ఆచార్య’లో నటించానని చెప్పారు. ఒకేసారి రెండు చిత్రాల్లో నటించడం ఎలా అనిపించింది? ‘ఆచార్య’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయకపోవడానికి కారణమేంటి? తదితర విషయాలకు సమాధానం ఆయన మాటల్లోనే..
నా స్థానంలో నాన్న..
‘‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడే నేనూ కొరటాల శివ కలిసి పనిచేయాలనుకున్నాం. అప్పటికి కథ సిద్ధంగా లేకపోయినా ఫిక్స్ అయ్యాం. అదే సమయానికి రాజమౌళి ‘RRR’ గురించి చెప్పారు. శివకు ముందే మాటివ్వడంతో ‘‘మీ ప్రాజెక్టు పూర్తి చేసి.. రాజమౌళి దర్శకత్వంలో తర్వాత నటిస్తా’’ అని ఆయనకు చెప్పా. ‘‘కంగారేం వద్దండీ.. ఆలస్యమైనా పెద్ద సినిమా చేద్దాం. ఎన్టీఆర్తో కలిసి మీరు నటించడాన్ని.. ఓ సినిమా అభిమానిగా నేనూ కోరుకుంటున్నా’’ అని శివ నాకు భరోసా ఇచ్చారు. ఆయనిచ్చిన కంఫర్ట్ వల్లే ‘ఆర్ఆర్ఆర్’ షూట్కి ప్రశాంతంగా వెళ్లా. కొన్నాళ్లకు.. ‘శివతో సినిమా నేను చేస్తా’ అని నాన్న తన మనసులో మాట బయటపెట్టారు. అలా ‘ఆచార్య’ మొదలైంది’’
రాజమౌళినే కారణం..
‘‘ముందుగా ఈ ప్రాజెక్టులోకి నేను నిర్మాతగానే అడుగుపెట్టా తప్ప నటుడిగా కాదు. ఇందులోని అతిథి పాత్ర కోసం ఇతర హీరోలను సంప్రదించారు కానీ వీలుపడలేదు. దాంతో నన్ను అడిగారు. సుమారు 15 నిమిషాలే కదా చేసేద్దాం అనుకున్నా. అది కాస్తా చివరికి 40 ని.ల నిడివి ఉన్న పాత్రగా మారింది. దర్శకుడు రాజమౌళి సంగతి తెలిసిందే కదా. ఆయన సామ్రాజ్యంలోకి ఒక్కసారి ప్రవేశిస్తే పని పూర్తయ్యేదాకా బయటకు రావడం కష్టం. ‘ఆచార్య’లో నేను నటించేందుకు అంగీకరిస్తారా, లేదా? అనే సందేహంతో.. విషయం చెప్పగానే ఆయన ఓకే అన్నారు. ఓ రకంగా ఆయన కారణంగానే నేనీ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యా. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. శివ దర్శకత్వంలో నటించడం ఒకెత్తైతే.. నాన్నతో కలిసి తెరను పంచుకోవడం మరో ఎత్తు’’
అంతగా కష్టపడలేదు..
‘‘ఇందులో మా ఇద్దరి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. మా దారులు వేరైనా లక్ష్యం ఒకటే. నేనిందులో గురుకుల విద్యార్థి సిద్ధగా కనిపిస్తా. సోనూసూద్ నా మిత్రుడిగా నటించాడు. అటు ‘ఆర్ఆర్ఆర్’లో ఇటు ‘ఆచార్య’లో ఒకేసారి నటించడం అంత కష్టమనిపించలేదు. అంతా దర్శకులే చూసుకున్నారు. ‘ఈ సీన్లో ఇలా ఉండాలి. ఆ లుక్ అలా ఉండాలి’ అని పాత్రల్లోని వైవిధ్యాన్ని వారు వివరంగా చెప్పడంతో చాలా సులువుగా నటించేశా. మేమే కాదు ఈ కథలో ఏ ఇద్దరు హీరోలు నటించినా అది సూపర్ హిట్టే అవుతుంది. నేనూ నాన్న కలిశామని ఈ కథలో మార్పు చేయలేదు. ఉద్దేశపూర్వకంగా మా ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సన్నివేశాల్ని జత చేయలేదు. ప్రచార చిత్రంలో కనిపించిన పులుల షాట్ కూడా కథానుసారం తెరకెక్కించిందే’’
నాన్నను కొత్తగా చూశా..
‘‘నిజ జీవితంలో నాన్నా నేనూ ఎక్కువగా కలిసుండలేదు. ఆయన షూటింగ్కి పొద్దునే వెళ్తే రాత్రికి ఇంటికి చేరుకునేవారు. ‘ఆచార్య’ మాకు మరిచిపోలేని జ్ఞాపకాల్ని పంచింది. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లిలో సుమారు 20 రోజులు ఉన్నాం. నిద్ర లేవడం, పడుకోవడం, భోజనం, కసరత్తులు.. ఇలా ప్రతిదీ కలిసే చేసేవాళ్లం. సెట్స్లో అడుగుపెట్టాక నాన్న నన్ను కొడుకుగా కాకుండా ఓ నటుడిగానే చూశారు. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా’’
అందుకు సమయం లేదు..
‘‘ముందుగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదలచేయాలని అనుకోలేదు. తర్వాత, ‘ఆర్ఆర్ఆర్’ దృష్ట్యా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తే బాగుండనిపించింది. కానీ, డబ్బింగ్ తదితర కార్యక్రమాలకు కావాల్సిన సమయం లేకపోవడం వల్ల సాధ్యమవలేదు. మంచి కథ కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాం. ‘రంగస్థలం’లోని ఓ పాటతో పూజాహెగ్డేతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు కలిసి నటించాం. ఆమె ఎంతో అద్భుతమైన, బిజీ నటి. ఏ సినిమాలో చూసినా తనే కనిపిస్తుంది’’ (నవ్వుతూ..).
బాధ్యత పెరిగింది..
‘‘మన తెలుగు సినిమాలకు ఇంత పేరు వస్తుండటం చాలా గర్వంగా ఉంది. నాన్న చెప్పినట్టు ఒకప్పుడు దక్షిణాది చిత్రాలంటే ఉత్తరాది వారికి చిన్నచూపు ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో నా బాధ్యత పెరిగింది. సినిమాల సంఖ్య తక్కువైనా ఫర్వాలేదు, మంచి కథలు ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం.. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నా. చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ చిత్రం చేయబోతున్నా’’ అని రామ్చరణ్ పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు