Rana: గుర్తుండిపోయే కథ ఇది
రక్షిత్ శెట్టి కథానాయకుడిగా కిరణ్ రాజ్.కె తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘777 ఛార్లి’. ఓ కుక్క టైటిల్ పాత్ర పోషించింది. సంగీత శ్రింగేరి కథానాయిక. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రక్షిత్ శెట్టి కథానాయకుడిగా కిరణ్ రాజ్.కె తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘777 ఛార్లి’. ఓ కుక్క టైటిల్ పాత్ర పోషించింది. సంగీత శ్రింగేరి కథానాయిక. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు, నటుడు రానా మాట్లాడుతూ.. ‘‘లాక్డౌన్ సమయంలో రక్షిత్తో మాట్లాడినప్పుడు ఈ చిత్రం గురించి చెప్పాడు. ఏదో చిన్న ప్రయోగం చేస్తున్నాడులే అనుకున్నా. ట్రైలర్ చూశాక తనెంత భారీ స్కేల్లో ఈ సినిమా తీశాడో అర్థమైంది. అది చూశాక నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమా చూశాక కచ్చితంగా మీరు నవ్వుతారు, ఏడుస్తారు. అంతకంటే గొప్పగా ఈ కథ మీ జీవితాల్లో ఉండిపోతుంది’’ అన్నారు. ‘‘ఓ నటుడిగా నేనిప్పటి వరకు చేసిన చిత్రాల్లో అత్యంత కష్టపడిన చిత్రమిదే. ప్రతి సినిమాలోనూ రకరకాల సవాళ్లుంటాయి. ఓ జంతువుతో కలిసి చేయడానికి చాలా ఓపిక కావాలి. సెట్లో ఒక్కో సీన్ పూర్తి చేయడానికి కనీసం ముప్పై.. నలభై టేక్స్ తీసుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఒక్క షాట్ పూర్తి చేయడానికి రోజంతా పట్టేది. ఈ చిత్రంలో నేను ధర్మ అనే పాత్రలో కనిపిస్తా. తనదొక ఏకాంత ప్రపంచం. ఒంటరిగా జీవిస్తుంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఛార్లి అనే కుక్క ప్రవేశించాక ఎలాంటి మార్పులొచ్చాయి? అతనిలో దాగున్న ప్రేమను అదెలా బయటకు తీసింది? అన్నది చిత్ర కథాంశం. ఇలాంటి చిత్రం గత పదేళ్లలో రాలేదు. రాబోయే పదేళ్లలోనూ రాదు. అంత కష్టమైన చిత్రమిది. ట్రైలర్ లాగే సినిమా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు నటుడు రక్షిత్ శెట్టి. నటి సంగీత మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నేను దేవికా ఆరాధ్య అనే పాత్ర పోషించా. యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కనిపిస్తా. ఈ సినిమాతో ప్రయాణం నాకెంతో ప్రత్యేకం. ఇలాంటి చిత్రాలు చేయడానికి నిజంగా చాలా ఓపిక కావాలి’’ అంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!