Siddu Jonnalagadda: మొదలైంది తెలుసు కదా

స్టైలిస్ట్‌ నీరజ కోన దర్శకత్వంలో... సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ బుధవారం హైదరాబాద్‌లో  ప్రారంభమైంది.

Updated : 19 Oct 2023 12:42 IST

స్టైలిస్ట్‌ నీరజ కోన దర్శకత్వంలో... సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ బుధవారం హైదరాబాద్‌లో  ప్రారంభమైంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు నాని క్లాప్‌నిచ్చారు. దర్శకుడు బాబీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. హరీశ్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. కథానాయకులు నితిన్‌, ఆది పినిశెట్టి చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. మరికొన్ని రోజుల్లో రెగ్యులర్‌ చిత్రీకరణని ప్రారంభిస్తామని, ఇదొక మనసుల్ని హత్తుకునే ప్రేమకథా చిత్రమని సినీ వర్గాలు చెప్పాయి. ఈ కార్యక్రమంలో నందినిరెడ్డి, కోన వెంకట్‌, వక్కంతం వంశీ, బొమ్మరిల్లు భాస్కర్‌, మల్లిక్‌రామ్‌, సూర్యదేవర నాగవంశీ, విజేందర్‌రెడ్డి, హేమంత్‌ మధుకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని