Siddu Jonnalagadda: మొదలైంది తెలుసు కదా
స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో... సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో... సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు నాని క్లాప్నిచ్చారు. దర్శకుడు బాబీ కెమెరా స్విచ్చాన్ చేశారు. హరీశ్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కథానాయకులు నితిన్, ఆది పినిశెట్టి చిత్రబృందానికి స్క్రిప్ట్ని అందజేశారు. మరికొన్ని రోజుల్లో రెగ్యులర్ చిత్రీకరణని ప్రారంభిస్తామని, ఇదొక మనసుల్ని హత్తుకునే ప్రేమకథా చిత్రమని సినీ వర్గాలు చెప్పాయి. ఈ కార్యక్రమంలో నందినిరెడ్డి, కోన వెంకట్, వక్కంతం వంశీ, బొమ్మరిల్లు భాస్కర్, మల్లిక్రామ్, సూర్యదేవర నాగవంశీ, విజేందర్రెడ్డి, హేమంత్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
నాగార్జునతో బాబీ దేవోల్ ఢీ!
‘కుబేర’ తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన స్టూడియో గ్రీన్ పతాకంపై తమిళ దర్శకుడు నవీన్తో ఓ సినిమా చేయనున్నారు. -
మళ్లీ కలిసేనా?
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. -
మరోసారి ఈ జోడీ?
నాగచైతన్య - పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘తండేల్’ సినిమా చేస్తున్న చైతూ... తదుపరి కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
పేరు మరింత బాధ్యతని పెంచింది
పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం. -
భయపెడుతూనే నవ్విస్తుంది.. బాక్
‘అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. -
విదేశాల్లో వచ్చినా... మన దేశంలో రాలేదు
‘‘సుహాస్ అనగానే వినూత్నమైన కథలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని ఓ కొత్త కథని ‘ప్రసన్న వదనం’తో చెబుతున్నాం. -
నేను గ్యాంగ్స్టర్గా నటిస్తే...!
తన ఫొటోషూట్స్తో సామాజిక మాధ్యమాల్నీ సందడి చేస్తుంటుంది మాళవిక మోహనన్. చీర కట్టినా... చిట్టి పొట్టి ట్రెండీ దుస్తులేసినా గ్లామరస్గా కనిపించడంలో ఆమెదంటూ ఓ ప్రత్యేకమైన శైలి. -
యాక్షన్ గణేశుడు వస్తున్నాడు
గతేడాది ‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.