bigg boss non stop: ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ తేజస్వి మదివాడ ఎలిమినేట్‌

నాగార్జున వ్యాఖ్యాతగా ఓటీటీ వేదికగా అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’.

Published : 04 Apr 2022 01:15 IST

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా ఓటీటీ వేదికగా అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’. ఈ వారం హౌస్‌ నుంచి నటి తేజస్వి మదివాడ ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈవారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు తేజస్వికి వచ్చినట్లు చెప్పారు. దీంతో బిందు మాధవి, శివ, అరియానా, అనిల్ రాథోడ్, స్రవంతి సేఫ్‌ అయ్యారు.

ఎలిమినేట్‌ అయి, వేదికపైకి వచ్చిన తేజస్వి మాట్లాడుతూ.. ‘నేను సన్యాసం తీసుకున్నా. మూడేళ్ల నుంచి పెద్దగా రియాక్షన్స్‌ లేవు. దీంతో హౌస్‌లో కూడా కూల్‌గా ఉన్నా. అదే మైనస్‌ అయి ఉంటుంది. గతంలో బిగ్‌బాస్‌కు వచ్చినప్పుడు అందరిపైనా కోపం చూపించానని ఎలిమినేట్‌ చేశారు. ఇప్పుడు ఆ కోపం చూపించటం లేదని ఇలా ఎలిమినేట్‌ చేస్తున్నారు. సంచాలక్‌గా నటరాజ్‌ మాస్టర్‌ నిర్ణయం తీసుకుని నన్ను నామినేట్‌ చేశారు. అక్కడ ఫైట్‌ చేసే స్కోప్‌ లేదు’ అని చెప్పుకొచ్చింది. ఉగాది సందర్భంగా ఎవరికి తీపి, చేదు లడ్డూలు ఇస్తావని నాగార్జున అడగ్గా, అఖిల్‌, స్రవంతి, అరియానా, అషులకు తీపి లడ్డూలు ఇవ్వగా, బిందు మాధవి, శివలకు చేదు లడ్డూలు ఇచ్చింది. నటరాజ్‌ మాస్టర్‌కు తీపి, చేదు లడ్డూలు రెండూ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని