Sai Dharam Tej: ఆస్పత్రి నుంచి సాయిధరమ్‌ తేజ్‌ డిశ్చార్జ్‌.. చిరు ట్వీట్‌

సినీ ప్రియులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా....

Updated : 15 Oct 2021 13:48 IST

హైదరాబాద్‌: సినీ ప్రియులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు  సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు వెల్లడించారు. శుక్రవారం సాయితేజ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా ఆయన విషెస్‌ చెప్పారు. ‘విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో ప్రత్యేకమైన విశేషం ఉంది. అది ఏమిటంటే.. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో నేడు ఇంటికి వచ్చేశాడు. ఇది తనకి పునర్జన్మ లాంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే సాయి తేజ్‌’..’’ అని చిరంజీవి తెలిపారు.

సెప్టెంబర్‌ పదో తేదీన సాయి ధరమ్‌తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో జరిగిన ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ తన స్పోర్ట్స్‌ బైక్‌ నుంచి కిందకు పడిపోయారు. తీవ్ర గాయాలైన ఆయన్ని నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్సలో భాగంగానే ఆయనకు కాలర్‌ బోన్‌ సర్జరీ జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని