Drushyam 2: ‘దృశ్యం3’ కథ రాయాలంటే మూడేళ్లు పడుతుంది.. కానీ: వెంకటేశ్
వెంకటేశ్ ఇంటర్వ్యూ. ‘దృశ్యం 2’, ‘ఎఫ్ 3’ చిత్రాల గురించి ఆయన పంచుకున్న సంగతులివీ...
ఇంటర్నెట్ డెస్క్: రీమేక్ చిత్రాల్లో ఎక్కువగా నటించిన కథానాయకుల్లో వెంకటేశ్ ఒకరు. అలా ఇటీవల ‘నారప్ప’ (అసురన్ రీమేక్)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మరికొన్ని రోజుల్లో ‘దృశ్యం 2’తో థ్రిల్ పంచబోతున్నారు. ‘దృశ్యం’ సినిమాకి కొనసాగింపుగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రమిది. మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ‘దృశ్యం 2’కి రీమేక్గా రూపొందింది. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా నవంబరు 25 నుంచి ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మీడియాతో ముచ్చటించారు.
‘దృశ్యం 2’ ఎలా మొదలైంది?
వెంకటేశ్: ‘దృశ్యం’ సినిమాలోని రాంబాబు (కథానాయకుడి పాత్ర) ఎదుర్కొన్న సమస్య మీ అందరికీ తెలుసు. తప్పో ఒప్పో తన కుటుంబం కోసం పోరాడతాడు. క్రైమ్ జానర్లో ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అందుకే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. దానికి సీక్వెల్ చేయాలని చాలామంది అడిగేవారు. ఆ స్పందనతోనే మరో ‘దృశ్యం’ ఆవిష్కరణకు బీజం పడింది. సుమారు ఆరేళ్లకు అది కార్యరూపం దాల్చింది. దర్శకుడు జీతూ జోసెఫ్ ‘దృశ్యం 2’ని అద్భుతంగా తెరకెక్కించారు. తొలి భాగానికి మించిన ఎమోషన్, థ్రిల్లింగ్ అంశాలు ఇందులో ఉన్నాయి. తన ఫ్యామిలీ కోసం రాంబాబు ఈసారి ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
థియేటర్లు తెరచుకున్నా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు?
వెంకటేశ్: నటుడిగా నా పని నేను పూర్తి చేశాను. సినిమా విడుదల అనేది దర్శకనిర్మాతల ఇష్టప్రకారం జరుగుతుంది. కొవిడ్ సమయంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమాని థియేటర్లలో విడుదల చేయడం మంచిదా, ఓటీటీలో బెటరా అనే విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించడంలేదు. ఈ విషయంలో అభిమానులు ఫీలవుతారని తెలుసు. కానీ, కొన్నిసార్లు తప్పదు.. ఓపిక పట్టాలి. నా తదుపరి చిత్రాలు థియేటర్లలోనే సందడి చేస్తాయి.
రీమేక్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. కారణమేంటి?
వెంకటేశ్: నేను వెంటవెంటనే సినిమాలు చేయాలనుకుంటా. ఈ క్రమంలో అలా జరుగుతుంటుంది. పాజిటివ్ ఆలోచనతో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను కానీ అదే కావాలి, ఇదే చేయాలి అని అనుకోను. కథ, నా పాత్ర నచ్చితే చాలు ఎందులో అయినా నటిస్తా. ఎందుకో ఏమో అందరూ ‘మీరు ఎక్కువగా రీమేక్ చిత్రాలు ఎంపిక చేసుకుంటారేంటి?’ అని అడుగుతుంటారు. ఆయా పాత్రలకు నేను సరిపోతాననుకుని దర్శకనిర్మాతలు నన్ను సంప్రదిస్తుంటారు. అంతే తప్ప మరే కారణం లేదు.
‘దృశ్యం 3’ ఆలోచన ఉందా?
వెంకటేశ్: ‘దృశ్యం 2’కి కొనసాగింపుగా ‘దృశ్యం 3’ తెరకెక్కించాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. జీతూ మైండ్లో ఏముందో నాకు తెలియదు. ఒకవేళ ఈ సీక్వెల్ని తీయాలంటే కథను రాయడానికే సుమారు మూడేళ్ల సమయం పడుతుంది.
‘ఎఫ్ 3’ సంగతులేంటి?
వెంకటేశ్: ‘ఎఫ్ 2’కి ఎంతగా నవ్వించిందో అంతకు నాలుగైదు రెట్లు నవ్వులు పంచుతుంది ‘ఎఫ్ 3’. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది. కొన్ని రోజుల క్రితమే క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ మిగిలిఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.
తదుపరి చిత్రాలేంటి?
వెంకటేశ్: చాలామంది యువ దర్శకులు కథలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకీ సంతకం చేయలేదు. ఖరారైన వెంటనే ఆ వివరాల్ని తెలియజేస్తా. ప్రస్తుతానికి రానాతో కలిసి ఓటీటీ ‘నెట్ఫ్లిక్స్’ ప్రాజెక్టులో నటిస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు దానికోసం 100 శాతం కష్టపడదాం. పని లేనప్పుడు ఖాళీగా హ్యాపీగా ఉందాం. ప్రపంచాన్ని చుట్టేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. వీటికి మించింది ఏముంది?.. అనే ఆలోచనతో ముందుకు సాగుతుంటా.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!