Balakrishna: టాక్‌ షో హోస్ట్‌గా బాలయ్య.. పీక్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌

అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఇకపై ఆయన వెండితెరపైనే కాదు.. ఓటీటీ వేదికగానూ సందడి చేయనున్నారు....

Published : 10 Oct 2021 14:29 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఇకపై ఆయన వెండితెరపైనే కాదు.. ఓటీటీ వేదికగానూ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ ఓ సెలబ్రిటీ టాక్‌ షోకు రంగం సిద్ధం చేసింది. త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఆహా ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. టాక్‌ షోలన్నింటికీ బాప్‌ త్వరలో రానుంది..! పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలయ్య ‘అఖండ’ పనుల్లో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా షూటింగ్‌ ఇటీవల పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈసినిమాలో బాలయ్య విభిన్నమైన లుక్స్‌లో సందడి చేయనున్నారు.

హోస్ట్‌ బాలయ్య.. గెస్ట్‌ రౌడీనా..!

బాలయ్య హోస్ట్‌గా ప్రసారం కానున్న ఈ టాక్‌ షోలో మొదటి గెస్ట్‌గా నటుడు విజయ్‌ దేవరకొండ కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ.. ‘లైగర్‌’ సెట్‌కి వెళ్లి మరీ విజయ్‌ దేవరకొండను కలిశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని