Sirivennela: ఎప్పుడూ ‘మిత్రమా’ అని పిలిచేవారు: చిరంజీవి
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఫిలింఛాంబర్లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఫిలింఛాంబర్లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అగ్ర కథానాయకులు నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, అల్లు అర్జున్తో పాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీతారామశాస్త్రితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చిరంజీవి
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చాలా చాలా దురదృష్టకరమని చిరంజీవి అన్నారు. ఆయనతో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని తానేనని.. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి ఆస్పత్రిలో చేరారని చెప్పారు. మంచి చికిత్స కోసం చెన్నై తీసుకెళ్తానని కూడా చెప్పానని చిరంజీవి అన్నారు. ‘‘ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం. ఎప్పుడూ నన్ను ‘మిత్రమా’ అని పిలిచేవారు. బాలుగారు, సిరివెన్నెల చనిపోవటం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. మంచి మిత్రుడిని కోల్పోయా. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన జ్ఞాపకార్థం తప్పకుండా ఏదో ఒక కార్యక్రమం చేస్తాం’’ అని చెప్పారు.
తెలుగు భాషకు, సాహిత్యానికి ‘సిరివెన్నెల’ ఆభరణం: బాలకృష్ణ
పుట్టిన జాతికి ఎవరైతే కీర్తి తెస్తారో వారు ఉన్నా, లేకున్నా చిరస్థాయిగా నిలిచిపోతారని.. అలాంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని బాలకృష్ణ అన్నారు. తెలుగు భాష, సాహిత్యానికి ఆభరణంలాంటి వ్యక్తి సిరివెన్నెల అని కొనియాడారు. తాను నటించిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేయడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు. సిరివెన్నెల లేరనే వార్తతో చలనచిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయిందన్నారు. తామిద్దం కలిసినప్పుడల్లా సాహిత్యం గురించే మాట్లాడుకునేవాళ్లమని.. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని బాలకృష్ణ అన్నారు.
ఓ లెజెండ్ను కోల్పోయాం: వెంకటేశ్
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో సాహిత్యరంగంలో ఓ లెజెండ్ను కోల్పోయామని వెంకటేశ్ అన్నారు. తన కెరీర్ తొలినాళ్ల నుంచి సిరివెన్నెలతో కలిసి పనిచేశానని చెప్పారు. స్వర్ణకమలం నుంచి నారప్ప వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఒక వటవృక్షం కూలిపోయింది.. ఇక అంతా శూన్యమే: తనికెళ్ల భరణి
సిరివెన్నెల మృతితో ఒక వటవృక్షం కూలిపోయిందని.. ఇక అంతా శూన్యమేనని ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. తామిద్దం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చామని గుర్తుచేసుకున్నారు. స్రవంతి మూవీస్లో కలిసి పనిచేశామని.. రాత్రింబవళ్లూ అక్కడే ఉండేవాళ్లమన్నారు. ప్రతి పాటకు 15 వెర్షన్లు ఎందుకంటే నవ్వేవాడన్నారు. ప్రతి పదాన్ని చెక్కేవాడని తనికెళ్ల భరణి గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ సిరివెన్నెల పాటల ప్రకాశం ఉంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!