Oke Oka Jeevitham:జీవితాంతం చెప్పుకొనేలా...‘ఒకే ఒక జీవితం’
శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూవర్మ కథా నాయిక. శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శర్వానంద్
శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూవర్మ కథా నాయిక. శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమల అక్కినేని ముఖ్యభూమిక పోషించారు. సైంటిఫిక్ అంశాలతో కూడిన ఈ ఫ్యామిలీ డ్రామాకి తరుణ్ భాస్కర్ మాటల్ని సమకూర్చారు. బుధవారం ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ‘ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు ఆశ్చర్యపోవచ్చు, అసలు నమ్మకపోవచ్చు. కానీ ఇది నమ్మే తీరాలి...’ అంటూ మొదలయ్యే టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుంది. టీజర్ విడుదల అనంతరం శర్వానంద్ మాట్లాడారు. ‘‘జీవితాంతం ఇది నా సినిమా అని చెప్పుకొనేలా ఉంటుంది. ఈ కథ చెప్పగానే అమలగారు చేస్తున్నారా? అని అడిగాను. కథకి ఆత్మలాంటి పాత్రలో ఆమెని మాత్రమే ఊహించుకున్నా. జేక్స్ బిజోయ్ సమకూర్చిన అన్ని పాటలూ చాలా బాగుంటాయి. ముఖ్యంగా అమ్మ పాట. ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి సర్ తొమ్మిది నెలలు రాశారు. ఆ పాట కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అమల మేడమ్, సిరివెన్నెల సర్ మాతృమూర్తులతోపాటు, మా అమ్మని ఆహ్వానించి అక్కడ విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ముందు ఒక కథ రాశా. అందులో భావోద్వేగాలు కనిపించలేదు. ఆ తర్వాత మా అమ్మ చనిపోయారు. అప్పుడు మళ్లీ కథ రాసేందుకు కూర్చున్నా. అమ్మని చూడాలనిపించింది. అమ్మని చూడాలని రాసిన ఒక్క సన్నివేశం అలా పెరిగి ‘ఒకే ఒక జీవితం’ సినిమాగా మారింది. శర్వా నటించినప్పుడు తన పాత్రలో నన్ను నేను చూసుకున్నా. తను ఈ చిత్రంతో అందరినీ 90వ దశకంలోకి తీసుకెళతాడు. ఇందులోని అమ్మ పాత్ర రాసినప్పుడే అది అమల మేడమే చేయాలనుకున్నా. భావోద్వేగాలతోపాటు ఇందులో కామెడీ ఉంటుంది. ఈ సినిమా కోసం నేను, నా బృందం ఆరేళ్లు ప్రయాణం చేశాం. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డార’’న్నారు. అమల అక్కినేని మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో అందరికీ అమ్మను అయిపోయా. కథ చెప్పినప్పుడు మిగిలిన సినిమాలు చేసినా చేయకపోయినా ఈ పాత్ర చాలు అనిపించింది. శ్రీకార్తీక్ ఎంతగా కష్టపడ్డాడో, ఈ చిత్రంతో తనకి అంతగా పేరొస్తుంది’’ అన్నారు. ఈ సినిమా మనందరి మనసుల్ని తాకుతుందన్నారు తరుణ్భాస్కర్. ఈ కార్యక్రమంలో సతీష్, ఎడిటర్ శ్రీజిత్, ఛాయాగ్రాహకుడు సుజిత్, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్, నిర్మాత ఎస్.ఆర్.ప్రభు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర