ఎఫ్‌3: ఇక వరుణ్‌ వంతు

మెగా హీరో‌ వరుణ్‌తేజ్‌ ‘ఎఫ్‌3’ సెట్‌లో కాలుపెట్టారు. ఇటీవల వరుణ్‌ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దాన్నుంచి పూర్తిగా కోలుకున్నాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.........

Updated : 12 Jan 2021 06:18 IST

హైదరాబాద్‌: మెగా హీరో‌ వరుణ్‌తేజ్‌ ‘ఎఫ్‌3’ సెట్‌లో కాలుపెట్టారు. ఇటీవల వరుణ్‌ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దాన్నుంచి పూర్తిగా కోలుకున్నాక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘ఎఫ్‌3’ సెట్‌కు చేరుకొని చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్వయంగా ట్విటర్‌లో పంచుకున్నారు. ‘సెట్లోనూ సందడి మొదలు కాబోతోంది’ అని ఆయన రాసుకొచ్చారు. ఇటీవల వెంకీమామపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా.. వరుణ్‌ కూడా రావడంతో సినిమా షూటింగ్‌ వేగం పుంజుకోనుంది.

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో అనిల్‌ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్‌2’ సందడి చేసింది. దానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ ఇద్దరికీ జోడీగా తమన్నా, మెహరీన్‌ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు.

ఇదీ చదవండి

టీజర్‌లాగే సినిమా కూడా నచ్చుతుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని